Emergency: ఎట్టకేలకు ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన కంగనా..

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Published : 25 Jun 2024 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). ఈ సినిమా కొత్త విడుదల తేదీని కంగనా ప్రకటించారు. ‘దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఆ చీకటి రోజులకు సంబంధించిన ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తున్నా’ అంటూ సెప్టెంబర్‌ 6న ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు.

ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?

ఎమర్జెన్సీ కంగనాకు (Kangana Ranaut) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్‌ 24న విడుదల చేయాలని భావించారు. ఆతర్వాత జూన్‌ 14కు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్‌ 6ను ఫిక్స్‌ చేశారు. గతంలో ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీనికోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. మొదటి షెడ్యూల్ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కంగనా నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని