Kalki 2898 AD Collections: రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.  

Published : 01 Jul 2024 00:14 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ మూవీ వారంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో కల్కి చిత్రం వసూళ్లపై ప్రభాస్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు. 

అగ్ర తారలు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె తదితర భారీ తారాగణం నటించిన ఈ చిత్రంపై అన్ని చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు ‘కల్కి’ ఓ అద్భుతమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ మధ్య ఉన్న యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ వండర్‌ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ చిత్రంతో పురాణాలను భాగం చేయడంతో కర్ణుడికి సంబంధించి చరిత్ర విశేషాల వీడియోలు, రీల్స్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ‘కల్కి’ చూసినవాళ్లు.. పార్ట్‌-2పై ఎప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని