- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జయప్రకాశ్రెడ్డి.. తెలుగు ‘అలెగ్జాండర్’!
అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు...
ఇంటర్నెట్డెస్క్: అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనే జయప్రకాశ్ రెడ్డి. 100 నిమిషాల నాటకంలో ఏక పాత్రధారిగా, అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడంతోపాటు..నటన అంటే ఓ సామాజిక బాధ్యత అని చెప్పిన ఆయన ఆశయం చిరస్మరణీయం
అలాంటి పాత్ర అది..
అలెగ్జాండర్... ఓ మాజీ సైనికాధికారి కథ. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు దేశ సరిహద్దుల్లో పోరాడి, పదవీ విరమణ తర్వాత కూడా సమాజం బాగు కోసం తపన పడిన హృదయమది. తాను ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్నా, ఫోన్ ద్వారా తమ సమస్యలు చెప్పుకునే వారికి ఓ పెద్ద దిక్కులా మారి, వారిలో స్ఫూర్తిని రగిలించే ఓ తండ్రి తత్వమది. జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా పోరాడాలి కానీ, పిరికితనంతో ప్రాణాలను బలి చేసుకోకూడదంటూ ఓ నటుడి అంతర్మథనం నుంచి పుట్టుకొచ్చిన పాత్ర అది. ఆ పాత్ర జయ ప్రకాష్ రెడ్డి విలక్షణ నటన ద్వారా తొలుత రంగస్థలం పైనా, ఆ తర్వాత వెండితెరపైన తన బాధ్యతను నెరవేర్చుకుంది.
తెరమీదకు తెచ్చినప్పటికీ..
సినిమాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ నాటకమంటే తనకున్న అమితమైన ఆసక్తి వల్ల ఒకే ఒక పాత్ర ఉండే ఈ ‘అలెగ్జాండర్’ కథ రాయమని జయప్రకాశ్ రెడ్డి రచయిత పూసలను కోరారు. ఆయన 100 నిముషాల నిడివి ఉండేలా కథను అందించారు. ఆ తర్వాత తనకు ఏమాత్ర ఖాళీ సమయం దొరికినా జయప్రకాశ్ ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 సార్లు ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శించారు. ప్రజల్లో భవిష్యత్తులో నాటకాలపై మక్కువ తగ్గుతూ ఉండటంతో దాన్ని సినిమాగా చిత్రీకరించాలనుకున్నారు. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం సహాయంతో ‘అలెగ్జాండర్’ చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
సినిమాలో కనిపించకపోయినా, ఆయనతో ఫోన్లో మాట్లాడే పాత్రలుగా కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, కొండవలస, రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు ఇలా వీరంతా గాత్రాన్ని అందించారు. ఇంత చేసినప్పటికీ సినిమా విడుదలకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఓ సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైక పాత్రగా ఉన్న ఆ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు. తనను కాకుండా..ఆ కథలో తను చెప్పదలుచుకున్న సందేశాన్ని చూసేందుకు అయినా... ప్రేక్షకులు సినిమాని ఆదరించాలి అంటూ ఆయన ఎన్నో సార్లు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.. అయితే తాజాగా అందరికీ ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆ సినిమాను చేరువ చేయాలనే ప్రయత్నాలు జరుగుతుండగానే జయప్రకాశ్ రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా