Gopichand: ఇటలీలో ముగించారు

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.

Updated : 14 Oct 2023 13:47 IST

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ పూర్తయినట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ‘‘ఇది గోపీచంద్‌కు 32వ సినిమా. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మాస్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు చోటుంది. ఎక్కువ భాగం విదేశాల్లో సాగుతుంది. ఈ తాజా షెడ్యూల్‌లో భాగంగా ఇటలీ, మిలాన్‌లోని పలు అందమైన లొకేషన్లలో గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. అలాగే శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో ఓ పాటను పూర్తి చేశాం’’ అని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: కేవీ గుహన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని