- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కొత్త జంటకు దెయ్యం పాట్లు
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే.
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. కానీ పొరపాటున చిన్న గుమ్మాన్ని మూసేస్తుంది కొత్తగా పెళ్లైన ఓ జంట. ఆ తర్వాతేం జరిగింది? అసలు కథేంటి తెలియాలంటే ‘కాకుద’ చిత్రం చూడాల్సిందే. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లో ఈ ఉత్కంఠ రేపే సన్నివేశాలు చూపించారు. సోనాక్షి సిన్హా, రితేశ్ దేశ్ముఖ్, షకీబ్ సలీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ‘ముంజ్యా’ దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్నే ఈ హారర్ కామెడీకీ దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షి, షకీబ్లు దెయ్యంతో ఇబ్బంది పడే కొత్త జంటగా కనిపించగా.. దెయ్యాన్ని వెంటాడి బంధించడానికి వచ్చే మాంత్రికుడిగా రితేశ్ నటించారు. ఈ సినిమా జులై 5న విడుదలవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ చరిత్రగానే ఈ కథను చెప్పా
తెలుగు సినిమా అనగానే చాలా మందికి ‘మాయాబజార్’ గుర్తొస్తుంది. అది ఒక రకంగా మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే అయినా అందులోని ప్రధాన అంశం కల్పితం. -
‘బింబిసార2’కి రంగం సిద్ధం
కథానాయకుడు నందమూరి కల్యాణ్రామ్ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన ‘బింబిసార’ చిత్రానికి ప్రీక్వెల్గా ఆ చిత్రం రూపొందనుంది. -
‘ఆల్ఫా’ అమ్మాయిల రాకకు వేళాయే!
‘రాజీ’లో దేశం కోసం సాహసాలు చేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది అందాల తార అలియా భట్. ఇప్పుడామె మరోసారి వైఆర్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో తనలోని యాక్షన్ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
వీర... కుబేర
ధనుష్, నాగార్జున కథానాయకులుగా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. -
దుల్కర్కి జోడీగా కృతి?
‘మనమే’ అంటూ ఇటీవల తెరపై సందడి చేసింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. వరస సినిమాలతో మలయాళ, తమిళ భాషల్లో జోరు చూపిస్తున్న ఈ భామ, కథానాయకుడు దుల్కర్ సల్మాన్తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. -
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తి
విజయవంతమైన ‘ఇస్మార్ట్ శంకర్’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. -
ఈటీవీ విన్లో ‘శశి మథనం’ జోరు
బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా సింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మథనం’. వినోద్ గాలి దీన్ని రూపొందించారు. -
అందాల ప్రణయ గోదారి
సదన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్ కథానాయిక. సునీల్ రావినూతల ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్
టికెట్ రేట్ల వ్యవహారంలో అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు