- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
షారుక్కి స్విట్జర్లాండ్ పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. ఈ చిత్రోత్సవాలు స్విట్జర్లాండ్లోని లోకర్నోలో జరగనున్నాయి. ఈ సందర్భంగా షారుక్ నటించిన ‘దేవదాస్’ని ఆగస్టు 7న చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. షారుక్ సినీరంగానికి చేసిన చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ‘32 ఏళ్లలో వందకుపైగా చిత్రాల్లో నటించిన భారతీయ సూపర్స్టార్, గ్లోబల్ ఐకాన్ ఆయన. అన్నిరకాల జానర్స్లో, విశేషమైన పాత్రల్లో నటించారు. ఆ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసి గౌరవిస్తున్నాం’ అని చిత్రోత్సవాల వెబ్సైట్లో తెలిపారు. అందులో షారుక్ని.. కింగ్ ఖాన్, నటనలో లెజెండ్, జనం హీరోగా అభివర్ణించారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ చరిత్రగానే ఈ కథను చెప్పా
తెలుగు సినిమా అనగానే చాలా మందికి ‘మాయాబజార్’ గుర్తొస్తుంది. అది ఒక రకంగా మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే అయినా అందులోని ప్రధాన అంశం కల్పితం. -
‘బింబిసార2’కి రంగం సిద్ధం
కథానాయకుడు నందమూరి కల్యాణ్రామ్ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన ‘బింబిసార’ చిత్రానికి ప్రీక్వెల్గా ఆ చిత్రం రూపొందనుంది. -
‘ఆల్ఫా’ అమ్మాయిల రాకకు వేళాయే!
‘రాజీ’లో దేశం కోసం సాహసాలు చేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది అందాల తార అలియా భట్. ఇప్పుడామె మరోసారి వైఆర్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో తనలోని యాక్షన్ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
వీర... కుబేర
ధనుష్, నాగార్జున కథానాయకులుగా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. -
దుల్కర్కి జోడీగా కృతి?
‘మనమే’ అంటూ ఇటీవల తెరపై సందడి చేసింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. వరస సినిమాలతో మలయాళ, తమిళ భాషల్లో జోరు చూపిస్తున్న ఈ భామ, కథానాయకుడు దుల్కర్ సల్మాన్తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. -
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తి
విజయవంతమైన ‘ఇస్మార్ట్ శంకర్’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. -
ఈటీవీ విన్లో ‘శశి మథనం’ జోరు
బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా సింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మథనం’. వినోద్ గాలి దీన్ని రూపొందించారు. -
అందాల ప్రణయ గోదారి
సదన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్ కథానాయిక. సునీల్ రావినూతల ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్
టికెట్ రేట్ల వ్యవహారంలో అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు