చేరాలమ్మా తారా తీరాలే..

‘డార్లింగ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు నభా నటేశ్, ప్రియదర్శి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్‌రామ్‌ తెరకెక్కించారు. కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు.

Published : 03 Jul 2024 00:53 IST

డార్లింగ్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు నభా నటేశ్, ప్రియదర్శి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్‌రామ్‌ తెరకెక్కించారు. కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు. బ్రహ్మానందం, అనన్య నాగళ్ల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘‘చేరాలమ్మా తారా తీరాలే.. కరిగేపోవా దూరాలే’’ అంటూ సాగిన ఈ గీతానికి వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చగా.. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. ‘‘కొత్తదనం నిండిన కథతో ఆహ్లాదభరితమైన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని ముస్తాబు చేస్తున్నాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని