పాన్‌ ఇండియా కథలో

ఇటీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్‌బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

Published : 02 Jul 2024 01:19 IST

టీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్‌బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’, ‘ప్యాడ్‌ మ్యాన్‌’ లాంటి విజయంతమైన చిత్రాల్ని నిర్మించిన ప్రేరణ అరోరా దీన్ని సమర్పిస్తున్నారు. శివిన్‌ నారగ్, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ప్రపంచ స్థాయి సినిమాటిక్‌ అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర బృందమంతా ఎంతో కష్టపడుతోంది. ఇది ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందనే నమ్మకముంది’’ అన్నారు. ‘‘కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకు, మంచికి మధ్య జరిగే యుద్ధంగా ఉంటుంది. మన పురాణాలతో అనుసంధానమై ఉన్న ఎన్నో రహస్యాల్ని ఇది వెలికి తీస్తుంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో సుధీర్‌కు జోడీగా ఓ బాలీవుడ్‌ కథానాయిక కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రికి రానుంది. ఆగస్టు 15న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని