- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పాన్ ఇండియా కథలో
ఇటీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.
ఇటీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ‘రుస్తుం’, ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి విజయంతమైన చిత్రాల్ని నిర్మించిన ప్రేరణ అరోరా దీన్ని సమర్పిస్తున్నారు. శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుధీర్బాబు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర బృందమంతా ఎంతో కష్టపడుతోంది. ఇది ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందనే నమ్మకముంది’’ అన్నారు. ‘‘కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకు, మంచికి మధ్య జరిగే యుద్ధంగా ఉంటుంది. మన పురాణాలతో అనుసంధానమై ఉన్న ఎన్నో రహస్యాల్ని ఇది వెలికి తీస్తుంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇందులో సుధీర్కు జోడీగా ఓ బాలీవుడ్ కథానాయిక కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రికి రానుంది. ఆగస్టు 15న ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్కి జోడీగా సమంత జత కుదిరిందా?
ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
అంతర్గత శత్రువులతో పోరుకి సిద్ధం
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి. -
మూడు పాత్రలతో..
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. -
ఐదుగంటలు మేకప్ వేసుకున్నా!
‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది. -
కొత్త జంటకు దెయ్యం పాట్లు
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. -
షారుక్కి స్విట్జర్లాండ్ పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. -
కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది
మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విష్వక్సేన్.. లైలా
ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్సేన్ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
కలెక్షన్స్ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ మరో మైలురాయి దాటింది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన