నన్ను మరోస్థాయికి తీసుకెళ్లిన క్షణాలవి!

త్వరలో ‘దో పత్తీ’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయిక కృతి సనన్‌. గతేడాది ‘మిమీ’ చిత్రంలోని తన నటనగానూ అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆమె.. ఈ సినిమాతో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపింది.

Published : 02 Jul 2024 01:17 IST

త్వరలో ‘దో పత్తీ’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయిక కృతి సనన్‌. గతేడాది ‘మిమీ’ చిత్రంలోని తన నటనగానూ అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆమె.. ఈ సినిమాతో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి..‘మిమీ’ తన కెరీర్‌ను ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి ఆసక్తికర సంగతులను పంచుకుంది. ‘‘మీకు నచ్చే విధంగా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అవి విడుదలైన రోజు ప్రేక్షకులు మీలో ఉన్న కొత్త విషయాల్ని గురించి తెలుసుకుంటారు. నాకు ‘మిమీ’తో అదే జరిగింది. నటిగా ఎన్నో అవకాశాలను అందుకునేలా చేసింది. నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఆ అద్భుతమైన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నటిగా నా జీవితానికి కావాల్సినవి అందించిన ఈ చిత్రం మరిచిపోలేని సంతృప్తినిచ్చింది. ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించినా.. నాలోని నటనా నైపుణ్యాలను, ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సినిమా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’’ అని చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని