- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మళ్లీ అలాంటి అవకాశం రాలేదు
‘‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.
‘‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా. గతేడాది ‘డ్రీమ్ గర్ల్2’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించలేదు. తాజాగా ఆయన తన కెరీర్ను మలుపు తిప్పడానికి ‘దమ్ లగా కే హైషా’ కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయుష్మాన్.. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘‘పరాజయాలను ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే నిజమైన నటుడని నా అభిప్రాయం. విజయం నా దృష్టిలో చాలా చెడ్డది. మీరు ఎదుర్కొన్న వైఫల్యాలే మీకు స్నేహితులు, తత్వవేత్తలు. ప్రారంభ రోజుల్లోనే కష్టనష్టాలు అనుభవించకపోతే.. భవిష్యత్తులో వాటిని అధిగమించడం కష్టం అవుతుంద’’ని అన్నాడు. ‘‘నా మొదటి సినిమా ‘విక్కీ డోనర్’ తర్వాత వరుసగా పరాజయాలే అందుకున్నాను. ఈ చిత్రంతో పరిశ్రమలో ఒక బెంచ్మార్క్ను సెట్ చేసుకున్న నాకు.. మళ్లీ ఎలాంటి అవకాశాలు రాలేదు. 2015లో ‘దమ్ లగా కే హైషా’ సినిమా హిట్తో నా ప్రయాణం మళ్లీ మొదలైంది. కాబట్టి ఒక నటుడిగా కాకుండా.. ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను, పాత్రలను ఎంచుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్కి జోడీగా సమంత జత కుదిరిందా?
ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
అంతర్గత శత్రువులతో పోరుకి సిద్ధం
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి. -
మూడు పాత్రలతో..
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. -
ఐదుగంటలు మేకప్ వేసుకున్నా!
‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది. -
కొత్త జంటకు దెయ్యం పాట్లు
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. -
షారుక్కి స్విట్జర్లాండ్ పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. -
కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది
మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విష్వక్సేన్.. లైలా
ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్సేన్ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
కలెక్షన్స్ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ మరో మైలురాయి దాటింది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ