- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ది ఇండియా హౌస్ ప్రారంభం
కథానాయకుడు రామ్చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’.
కథానాయకుడు రామ్చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ కథానాయిక. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంగళవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది. ‘‘1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ, ఛాయాగ్రహణం: కామెరాన్ బ్రైసన్. ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, విక్రమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హారర్ మిస్టరీకి శ్రీకారం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాత. సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత నవీన్ యెర్నేని క్లాప్నివ్వగా, దిల్రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘భిన్న ప్రపంచాన్ని ఆవిష్కరించే ఓ హారర్ మిస్టరీ చిత్రమిది. ఉత్కంఠ రేకెత్తిస్తూ, ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు కౌశిక్. సాయిశ్రీనివాస్, అనుపమ ఇదివరకెప్పుడూ చేయని పాత్రల్ని ఇందులో పోషిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, ఛాయాగ్రహణం: చిన్మయ్ సలాస్కర్, ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఎ.దత్, కళ: డి.శివ కామేశ్, కూర్పు: నిరంజన్ దేవరమానే.
శ్రీరామ్ హీరోగా... కోడి బుర్ర
‘ఒకరికి ఒకరు’, ‘రోజాపూలు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన శ్రీరామ్ కథానాయకుడిగా ‘కోడి బుర్ర’ తెరకెక్కుతోంది. శ్రుతి మేనన్, ఆరుషి కథానాయికలు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్గౌడ్ నిర్మిస్తున్నారు. మహావీర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్నివ్వగా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ని అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్ ఇప్పటివరకూ చేసిన పాత్రలకు భిన్నంగా, పోలీసు అధికారిగా కనిపిస్తార’’న్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘పేరుతోనే అందరిలోనూ ఆలోచన రేకెత్తించాం. చిత్రం తప్పకుండా అలరిస్తుంది’’అన్నారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ చిత్రీకరణని ప్రారంభిస్తామన్నారు నిర్మాతలు. మంచి కథని ఎంచుకుని మిత్రులు కలిసి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
నవ్వులు పంచే బర్త్డే బాయ్
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో విస్కి తెరకెక్కించిన చిత్రం ‘ది బర్త్డే బాయ్’. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 19న రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్ను దర్శకుడు మెహర్ రమేశ్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చూస్తుంటే కొత్తదనంతో కూడిన సినిమాలా అనిపిస్తోంది. వినోదానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా సినిమా. ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించాం. ఇందులోని ప్రతి పాత్ర అందర్నీ అలరిస్తుంది. సహజత్వం కోసం సింక్ సౌండ్ విధానంలో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు దర్శకుడు విస్కి.
హంతకుల వేటలో కరీనా
తన కూతురిని కోల్పోయిన ఓ డిటెక్టివ్.. ఆ హత్యకు సంబంధించిన కేసును ఛేదించడానికి రంగంలోకి దిగింది. మరి ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి..? పదేళ్ల చిన్నారిని చంపిన నిందితులను ఆమె పట్టుకోగలిగిందా..? అనేది తెలియాలంటే ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ చూడాల్సిందే. బాలీవుడ్ సీనియర్ కథానాయిక కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. హన్సల్ మెహతా తెరకెక్కించారు. గతేడాది లండన్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుపుతూ..ఓ పోస్టర్ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో జస్మిత్ భమ్రా అనే డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది కరీనా. ఏక్తా కపూర్, శోభా కపూర్తో కలిసి కరీనా ఈ సినిమాని నిర్మిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్కి జోడీగా సమంత జత కుదిరిందా?
ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
అంతర్గత శత్రువులతో పోరుకి సిద్ధం
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి. -
మూడు పాత్రలతో..
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కలయిక అనగానే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా మూడో చిత్రం కోసం ఆ ఇద్దరూ జట్టు కట్టారు. ఈసారి మూడు పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. -
ఐదుగంటలు మేకప్ వేసుకున్నా!
‘ముంజ్యా’ విజయంలో శార్వరీ వాఘ్ది కీలకపాత్ర. ప్రేక్షకుల్ని భయపెట్టి, నవ్వించి మొత్తానికి సినిమాని రూ.వంద కోట్ల క్లబ్లో చేర్చింది. కానీ ఈ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డానంటోంది. -
కొత్త జంటకు దెయ్యం పాట్లు
అదొక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ప్రతి మంగళవారం దెయ్యం రాకపోకల కోసం రెండోదాన్ని తెరిచి ఉంచాల్సిందే. -
షారుక్కి స్విట్జర్లాండ్ పురస్కారం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రతిష్ఠాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఆయనను ‘పార్డో అలా కెరియరే అస్కోనా-లోకర్నో టూరిజం’ అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. -
కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది
మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విష్వక్సేన్.. లైలా
ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా, ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విష్వక్సేన్ కూడా ‘లైలా’తో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. -
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
కలెక్షన్స్ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ మరో మైలురాయి దాటింది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ణు ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్