సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం

‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్‌ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్‌ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్, టబు.

Published : 01 Jul 2024 00:58 IST

దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్‌ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్‌ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్, టబు. త్వరలో వీరిద్దరి కలయికలో రూపొందిన ‘ఔరో మే కహా దమ్‌ థా’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేమకథా నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు.. మరోసారి అజయ్‌తో కలిసి నటించడం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘మేము వ్యక్తిగతంగా చాలా భిన్నం. కానీ.. స్క్రీన్‌పై అంతకు మించిన అనుబంధం మా మధ్యలో ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో ఒకే విధమైన అభిరుచులను కలిగి ఉంటాము. మేము స్నేహితులుగా ఎంత సన్నిహితంగా ఉన్నా.. సెట్లోకి అడుగుపెడితే కెమెరానే మా లోకం. ఒకసారి పనిచేస్తే..మళ్లీ మళ్లీ కలిసి నటించాలనిపించే వ్యక్తి’’ అని అంది. ‘భూల్‌ భులయ్యా 2’ విడుదల రోజుల్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అజయ్‌ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఆయనతో కలిసి నటించాను. కానీ..నా ముందు ఎప్పుడు నా నటనను ప్రశంసించిన రోజులు లేవు. ‘భూల్‌ భులయ్యా 2’ సినిమా హిట్‌ కావడానికి టబు ముఖ్యం కారణం’ అని నా గురించి అజయ్‌ మాట్లాడుతుంటే ఆశ్చర్యానికి గురయ్యాన’’ని ఆనాటి సంగతులను చెప్పుకొచ్చింది టబు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని