‘మిస్టర్‌ ఎక్స్‌’ పూర్తి చేశాడు

తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ఎక్స్‌’. మను ఆనంద్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్‌ కార్తిక్, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Published : 01 Jul 2024 00:53 IST

మిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ఎక్స్‌’. మను ఆనంద్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్‌ కార్తిక్, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంజు వారియర్, అనఘ కథానాయికలు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది చిత్రబృందం. ‘‘విజయవంతంగా షూటింగ్‌ను పూర్తి చేశాం. మునుపెన్నడూ చూడని ఓ కొత్తదనం నిండిన కథతో త్వరలో మీ ముందుకు వస్తామ’’ని వ్యాఖ్యల్ని జోడించింది. ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇద్దరు యువకుల ప్రయాణం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని