జంటగా మురిపించేనా!

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.

Published : 30 Jun 2024 01:12 IST

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిది చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె తెలుగులో మరో అవకాశం అందుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రానా హీరోగా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిశోర్‌ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి నాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు ప్రచారం వినిపిస్తోంది. రానా ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ‘వేట్టయాన్‌’లో నటించారు. అలాగే తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యం’ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని