- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జంటగా మురిపించేనా!
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిది చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె తెలుగులో మరో అవకాశం అందుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రానా హీరోగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిశోర్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి నాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు ప్రచారం వినిపిస్తోంది. రానా ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి ‘వేట్టయాన్’లో నటించారు. అలాగే తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యం’ చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకీ సరసన ఐశ్వర్య
కథానాయకుడు వెంకటేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. -
మరోసారి సీమ సింగారమే
కొన్ని పాత్రల్లో కొంతమంది నటుల్ని చూశాక ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. వాళ్ల కోసమే పుట్టాయేమో అనిపిస్తాయి ఆ పాత్రలు. -
నిప్పెట్టిన పటాకే.. డబుల్ దిమాకే
‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే’’ అంటూ హుషారుగా స్టెప్పేస్తున్నారు రామ్ పోతినేని. -
పాన్ ఇండియా కథలో
ఇటీవలే ‘హారోం హర’తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సుధీర్బాబు. ఇప్పుడాయన ఓ కొత్త కబురు వినిపించారు. వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. -
నన్ను మరోస్థాయికి తీసుకెళ్లిన క్షణాలవి!
త్వరలో ‘దో పత్తీ’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది నాయిక కృతి సనన్. గతేడాది ‘మిమీ’ చిత్రంలోని తన నటనగానూ అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆమె.. ఈ సినిమాతో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపింది. -
శ్రీలంకలో యాక్షన్ మొదలు
‘కల్కి 2898ఎ.డి’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
మళ్లీ అలాంటి అవకాశం రాలేదు
‘‘వైఫల్యాలే మీ గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు’’ అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభుదేవా
సినిమాల్లో తన నటనతోనే కాకుండా.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంటారు కథానాయకుడు ప్రభుదేవా. -
ది ఇండియా హౌస్ ప్రారంభం
కథానాయకుడు రామ్చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
‘భారతీయుడు’ విడుదలైన 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. అంత గ్యాప్ ఎందుకొచ్చిందో దర్శకుడు శంకర్ తెలిపారు. -
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల హవా చూపిస్తోంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.555 కోట్లు వసూలు చేసింది.