చిత్రీకరణలో ఓదెల2

తమన్నా ప్రధాన పాత్రధారిగా... అశోక్‌తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Published : 29 Jun 2024 01:06 IST

మన్నా ప్రధాన పాత్రధారిగా... అశోక్‌తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సంపత్‌ నంది కథతో తెరకెక్కిన  ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. భావోద్వేగాలు, థ్రిల్లింగ్‌ అంశాలు, యాక్షన్‌ ఘట్టాలతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుందని, ఈ సినిమా కోసం తమన్నా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సన్నద్ధమయ్యారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌.ఎస్, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు