- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Raj Tarun: నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
రాజ్ తరుణ్పై ఓ యువతి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్టు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్తరుణ్ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్ పోలీసులు స్వీకరించారు. రాజ్తరుణ్పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. తగిన ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు వెల్లడించారు.
మేం రిలేషన్లో ఉన్నాం.. కానీ : రాజ్ తరుణ్
ఈ పరిణామంపై రాజ్ తరుణ్ స్పందించారు. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను షార్ట్ఫిల్మ్స్ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్షిప్లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్ సర్కిల్, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. నేను వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేసింది. మరో అబ్బాయితో రిలేషన్ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా ఆమె కేసు పెట్టింది. అయినా అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్ మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్ విజ్ఞప్తి.. ఎక్స్ వేదికగా పోస్ట్!
పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్కు నటుడు సాయి తేజ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. ఈసారి ఆమె ఏమన్నారంటే? -
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం.. -
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
ఇటీవల సమంతను విమర్శించిన డాక్టర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ (Raj Tarun) మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి స్పందించారు. పెళ్లి తర్వాత జీవితంపై ఆమె మాట్లాడారు. -
‘కల్కి’ చరిత్రలో నిలిచిపోతుంది: అమితాబ్ బచ్చన్
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కల్కి’ని తెరకెక్కించడం పెద్ద సాహసమని అమితాబ్ బచ్చన్ అన్నారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డాక్టర్ వార్నింగ్పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్
తనకు వార్నింగ్ ఇచ్చిన డాక్టర్పై సమంత పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందని ఎక్స్లో వచ్చిన పోస్ట్కు హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. -
రజనీకాంత్తో మోహన్బాబు.. వైరలవుతోన్న ఫొటో
రజనీకాంత్తో దిగిన ఫొటోను మోహన్బాబు షేర్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే? -
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. -
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు. -
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. -
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
నటి వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అలాచేసిన వారు విజయ తీరాలకు చేరతారు: సీఎం రేవంత్
-
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వాట్సప్లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
-
రూ.10 లక్షలకు ఆయుష్మాన్ భారత్.. మరింత మందికి పథకం విస్తరణ?
-
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణులు వ్యవహరించాలి: పవన్