Ek Villain Returs: ఓటీటీలో ‘ఏక్‌విలన్‌ రిటర్న్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్‌ నుంచి వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్లలో ‘ఏక్‌ విలన్‌’కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. 8ఏళ్ల క్రితం విడుదలైన ఈ

Published : 31 Aug 2022 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నుంచి వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్లలో ‘ఏక్‌ విలన్‌’కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. 8ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవల ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’(Ek Villain Returs) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జాన్‌ అబ్రహం(John Abraham), అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor),

దిశాపటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు. మోహిత్‌ సూరి తెరకెక్కించారు. జులై 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెటఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబరు 9వ తేదీ నుంచి ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.  వన్‌ సైడ్‌ లవర్‌గా ఉన్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్‌ కిల్లర్‌ కథ ఇది. ఈ ప్రతినాయక ఛాయలున్న పాత్రను జాన్‌ పోషించారు. అతను చేసే వరుస హత్యలకు.. గతంలో దిశాతో తన ప్రేమకథకు ఉన్న లింకేంటి? అర్జున్‌కు అతనికి మధ్య గొడవేంటి? అసలు వీళ్లిద్దరిలో హీరో ఎవరు? విలన్‌ ఎవరు? తెలియాంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని