- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chiranjeevi: ‘విశ్వంభర’ డబ్బింగ్ మొదలు
ఒకవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఒకవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గురువారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటితోపాటు, నిర్మాణానంతర పనుల్లో మరింత నాణ్యతకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించనున్నారు.
ఆనవాయితీ కొనసాగిస్తూ...
ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ ప్రక్రియ తన ఇంట్లోనే జరిగిందంటూ, అందుకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు చిరంజీవి. గురువారం సంగీత దర్శకుడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోని విడుదల చేస్తూ, ‘ఆపద్బాంధవుడు’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకప్పుడు అందరం ఒక చోట చేరి, సంగీత దర్శకుడి ఊహల్లో ప్రవహిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకునేవాళ్లం. ఆ తర్వాతే పాట బయటికొచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ... మళ్లీ మా కీరవాణి ‘విశ్వంభర’ కోసం పాటల్ని కంపోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మా పాత రోజులు గుర్తొచ్చాయి. ‘ఆపద్బాంధవుడు’ సంగీతం కంపోజ్ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతికి లోనైంది’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు చిరంజీవి. ఈ వీడియోలో ‘ఆపద్బాంధవుడు’లోని ‘చుక్కల్లారా...’ పాటని కీరవాణి ఆలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈతరం సినిమా ‘భారతీయుడు 2’
భారతీయుడు 2’తో సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్హాసన్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని శంకర్ తెరకెక్కించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు ఇది కొనసాగింపు. -
మరొకటి ముగించారు!
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. -
వాస్తవికతకు దగ్గరగా ఉన్న పాత్ర అది
‘నన్ను ప్రభావితం చేసిన పాత్రల్లో ‘జబ్ వీ మెట్’లో గీత్ పాత్ర కూడా ఉంది’ అంటోంది బాలీవుడ్ కథానాయిక తాప్సి. గతేడాది ఒకే చిత్రం ‘డంకీ’తో సరిపెట్టుకున్న ఈమె ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. -
చారు.. నేరుగా మీ హృదయాల్లోకే!
కథానాయకుడు నాని.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. -
డిటెక్టివ్ రూహి
‘గులాబీ’లో ఆటోవాలాగా కనిపించనున్న బాలీవుడ్ భామ హుమా ఖురేషీ, ఇప్పుడు డిటెక్టివ్ రూహి పాత్ర పోషించనుంది. వికాస్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బయాన్’లో తను ఆ విధంగా కనిపించనుంది. -
బచ్చల మల్లి.. డబ్బింగ్కు శ్రీకారం
‘బచ్చల మల్లి’గా బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. -
కొత్త నేపథ్యంతో.. తుఫాన్
ఇటీవలే ‘లవ్గురు’తో ప్రేక్షకుల్ని అలరించారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన ‘తుఫాన్’తో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ మిల్టన్ తెరకెక్కించారు. -
టైటానిక్ నిర్మాత కన్నుమూత
‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి ఆల్ టైం గ్రేట్ హాలీవుడ్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ (63) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
ఫహాద్ డబ్బింగ్ షురూ..
‘జైలర్’తో హిట్ కొట్టి జోరుమీదున్నారు అగ్రకథానాయకుడు రజనీకాంత్. త్వరలో ‘వేట్టయాన్’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజే జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. -
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
ఇన్స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్
Nabha Natesh: ‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ విడుదల వేడుకలో కథానాయిక నభా నటేశ్ మాట్లాడారు. తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు.