- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shankar: ‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో శంకర్ (Director Shankar) అభిమానులతో ముచ్చటించారు.
షారుక్ ఖాన్తో సినిమా తీస్తారా?
శంకర్: కచ్చితంగా తీస్తాను. మంచి స్క్రిప్ట్ ఉంటే ఆయనతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేస్తారు?
శంకర్: చాలా ఐడియాలు ఉన్నాయి. ‘జేమ్స్ బాండ్’ తరహా చిత్రాలు తీయాలి. అలాగే హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తాను. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లకు ప్రాధాన్యం ఉండే మూవీలు. కచ్చితంగా ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాను. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.
శంకర్ సినిమాటిక్ యూనివర్స్ ఎందుకు క్రియేట్ చేయలేదు?
శంకర్: గతంలోనూ దీనికి సమాధానం చెప్పాను. ‘రోబో’ సమయంలో ఆ ఆలోచన వచ్చింది. నా అసిస్టెంట్ డైరెక్టర్లకు, కుటుంబసభ్యులకు, స్నేహితులకు దాన్ని వివరించా. వాళ్లు పాజిటివ్గా స్పందించలేదు. దీంతో నా ఆలోచన సరైనది కాదనిపించింది. అందుకే సైలెంట్ అయ్యాను. వాళ్లు సపోర్ట్ చేసుంటే క్రియేట్ చేసేవాడిని.
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
రజనీకాంత్, కమల్ హాసన్లతో మల్టీస్టారర్ తీస్తారా?
శంకర్: వీళ్లిద్దరితో ‘2.ఓ’ తీయాలనుకున్నా. కానీ, ఆ సమయంలో కమల్ హాసన్ బిజీగా ఉండడంతో కుదరలేదు.
మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ వచ్చిన పరిశ్రమలో వచ్చిన మార్పులు ఏంటి?
శంకర్: నేను సినీ రంగంలోకి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఎక్కువైంది. ఎలాంటి సినిమా తీయాలన్నా టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాంతో అద్భుతాలు చేయచ్చు. మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.
సినీ రంగంపై ఏఐ ప్రభావం ఉంటుందంటారా?
శంకర్: ఏఐ (కృత్రిమ మేధ) కంటే మనిషి ఆలోచనలు చాలా శక్తిమంతమైనవి. ఇప్పుడే కాదు.. కొన్ని ఏళ్ల తర్వాత కూడా మనుషుల ఆలోచనలు ఏఐ కంటే ముందుంటాయి. నా స్క్రిప్ట్కు తగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటాను. కానీ, టెక్నాలజీకి అనుగుణంగా స్క్రిప్ట్ను మార్చుకోను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు. -
విన్న కథలు 500.. చేసింది 50
పాత్రలో జీవించడం ఎలాగో తెలిసిన నటుడు విజయ్ సేతుపతి. అందుకే ఆయన నటించిన సినిమాలు చూస్తే తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప, ఆయన కనిపించడు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే... మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతుంటారు. -
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను శనివారం నిర్వహించారు. -
మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే!
తొలి సినిమా నుంచే ఎక్స్ప్రెస్ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి. -
‘సత్యభామ’ చేసినందుకు గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తాజా చిత్రం ‘సత్యభామ’. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. -
మహేశ్బాబుతో మల్టీస్టారర్.. సుధీర్ బాబు ఏమన్నారంటే
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. తాజాగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. -
ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా?: రష్మిక
ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
రేవ్ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మి.. ఏమన్నారంటే
చాలా రోజుల తర్వాత ‘యక్షిణి’ వెబ్ సిరీస్తో అలరించడానికి సిద్ధమయ్యారు నటి మంచు లక్ష్మి. తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. -
నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ
నటి లయ (Laya) తాజాగా ‘ఆలీతో సరదగా’ కార్యక్రమలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్కు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!