Nag Ashwin: ‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్‌ ఆడియన్స్‌కు నాగ్‌ అశ్విన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు.

Updated : 01 Jul 2024 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్‌ సొంతం చేసుకుంటోంది. తాజాగా అమెరికన్‌ ఆడియన్స్‌కు దర్శకుడు కృతజ్ఞతలు చెప్పారు. ఓ ప్రత్యేక వీడియో విడుదల చేస్తూ.. సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘మా నుంచి వచ్చే ప్రతి సినిమాకు అమెరికన్‌ ఆడియన్స్‌ చాలా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మంచి సినిమాకు అండగా ఉంటారు. అందరికంటే ముందుగా ‘కల్కి’ని ఆదరించారు. వారి చిత్రంగా భావించి సపోర్ట్‌ చేశారు. మీ స్నేహితులను, బంధువులను కూడా కల్కికి తీసుకెళ్లండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని బిగ్‌స్క్రీన్‌పై చూస్తే వచ్చే ఆనందం ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు దీన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారు’ అంటూ చిత్రాన్ని సపోర్ట్‌ చేస్తున్నందుకు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) థ్యాంక్స్‌ చెప్పారు.

అర్జునుడిగా నేను.. ప్రభాస్‌ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్‌ దేవరకొండ

మొదటి ఇండియన్‌ సినిమాగా రికార్డు..

ఇక ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ సేల్స్‌లోనే ఓవర్సీస్‌లో రికార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వసూళ్ల విషయంలో కల్కి అక్కడ మరో ఘనత సాధించింది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు 11 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మొదటి వారంలోనే ఈ మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఇంత తక్కువ సమయంలో ఏ భారతీయ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రాలేదని చిత్రబృందం తెలిపింది (Kalki Collections).

విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలుచేసి రికార్డు సృష్టించిన ‘కల్కి’.. వారాంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సినిమా మరెన్నో రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజువల్‌ వండర్‌గా ఉందంటూ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని