- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bunny Vasu: ...అలా చేస్తే నష్టమే
‘‘ఆర్ఆర్ఆర్’ లాంటి అత్యద్భుత సాంకేతిక విలువలున్న చిత్రాల్ని దక్షిణాది నుంచి ప్రపంచానికి అందిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా.. ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలన్నా టికెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఇవే ధరల్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు ఆపాదిస్తే నష్టపోవాల్సి వస్తుంది.
‘‘ఆర్ఆర్ఆర్’ లాంటి అత్యద్భుత సాంకేతిక విలువలున్న చిత్రాల్ని దక్షిణాది నుంచి ప్రపంచానికి అందిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా.. ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలన్నా టికెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఇవే ధరల్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు ఆపాదిస్తే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాతలే తమ చిత్రాల్ని జాగ్రత్తగా వర్గీకరించుకొని.. ధరల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఆదాయం వస్తుందని ఇష్టారీతిన ధరలు ఖరారు చేసుకుంటూ వెళ్తే.. భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్. జీఏ2 సినిమా పతాకంపై వైవిధ్యభరితమైన చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి తెరకెక్కించారు. జులై 1న విడుదల కానుంది. శనివారం బన్నీ వాస్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
ఈ పుట్టిన రోజుకు కొత్తగా ఎంచుకున్న లక్ష్యాలేంటి?
‘‘కొవిడ్ వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మూడేళ్లుగా సెట్స్పై ఉన్న పెద్ద చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ముందుకొచ్చేశాయి. మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల చేసుకోవడానికి ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికింది. అందుకే మా బ్యానర్ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం. జులై 1న వచ్చే ‘పక్కా కమర్షియల్’తో మొదలుపెట్టి.. అక్టోబర్ నెలాఖరు నాటికి అన్ని చిత్రాలు విడుదల చేసేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ‘18 పేజెస్’ను సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకుంటున్నాం. అల్లు శిరీష్తో చేస్తున్న సినిమాని ఆగస్ట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’.
ఇంతకీ ‘పక్కా కమర్షియల్’ ఎలా ఉంటుంది?
‘‘టైటిల్కు తగ్గట్లుగానే ఇది పక్కా ఎంటర్టైనర్. మామూలుగా గోపీచంద్ సినిమాలు కాస్త యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటాయి. దీంట్లో యాక్షన్తో పాటు మారుతి శైలి వినోదాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గోపీచంద్, రాశి ఖన్నా పాత్రలు, వాళ్ల కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బరువైన భావోద్వేగాలు, భారీ డ్రామాలు ఎక్కడా కనిపించవు.’’
ప్రస్తుతం ప్రతి సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మీ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాల విషయంలో ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?
‘‘మా జీఏ2 సంస్థ నుంచి వచ్చిన ఏ చిత్రాన్నీ 35రోజుల్లోపు ఓటీటీలో విడుదల చేసింది లేదు. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ను మరింత పెంచాలని చూస్తున్నాం. ఈ అంశంపై మిగిలిన చిత్ర నిర్మాతల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మా సంస్థలో నిర్మితమవుతున్నవి ఎక్కువ ఎంటర్టైనర్లే. వాటిని ఇంట్లో కూర్చొని చూస్తే నవ్వు రాదు. అందుకే వీలైనంత ఎక్కువ గ్యాప్ తర్వాత ఓటీటీలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం హిందీలో థియేట్రికల్ రిలీజ్కు ఓటీటీ విడుదలకు మధ్య కనీసం 8వారాల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టుకున్నారు. ఇది జులై నుంచి అమల్లోకి రానున్నట్లుంది. అలాగే దక్షిణాదిలోనూ దీనిపై ఎగ్జిబిటర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇక్కడా ఓటీటీ విడుదలలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు రావొచ్చని అర్థమవుతోంది’’.
‘పుష్ప2’ ఎప్పుడు మొదలవుతుంది? దీని తర్వాత అల్లు అర్జున్ చేయనున్న చిత్రమేది? సంజయ్ లీలా భన్సాలీతో సినిమా ఉంటుందా?
‘‘పుష్ప2’ స్క్రిప్ట్ సిద్ధమైంది. జులై నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేయాలన్న దానిపై అల్లు అర్జున్ ఆలోచిస్తున్నారు. దసరాకు కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఆ మధ్య అల్లు అర్జున్, సంజయ్ లీలా భన్సాలీ మధ్య జరిగింది సాధారణ మీటింగే. భన్సాలీకి ‘పుష్ప’ బాగా నచ్చింది. బన్నీకి ‘గంగూభాయి’ నచ్చింది. ఇద్దరూ కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆ సమయంలో సందర్భం కుదరడంతో కలిసి మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికైతే బన్నీ తర్వాతి డేట్స్ గీతా ఆర్ట్స్లోనే ఉన్నాయి’’.
మీ బ్యానర్లో రూపొందుతోన్న కొత్త చిత్ర విశేషాలేంటి?
‘‘చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాం. శ్రీకాకుళంలో జరిగిన ఓ యథార్థ కథ ఆధారంగా ఆ చిత్రం రూపొందనుంది. అలాగే పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాం. ఇదీ వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కనుంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’.
టికెట్ ధరల పెంపు విషయంలో అల్లు అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ అభిప్రాయమేంటి?
‘‘ఆయా చిత్రాలకయ్యే బడ్జెట్లు, దానికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్కు తగ్గట్లుగా టికెట్ ధరల్ని రూ.150 నుంచి రూ.300 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో నిర్మాతలకు ఈ వెసులుబాటు కల్పించారు. అయితే బడ్జెట్లు, క్రేజ్ను పక్కకు పెడితే.. ఓ సినిమాకి ఎంత టికెట్ పెట్టొచ్చనే విషయంలో ప్రేక్షకుడికి ఓ అభిప్రాయం ఉంటుంది. అది తనకు సానుకూలంగా ఉందంటే ఫ్యామిలీతో కలిసి థియేటరకు వస్తాడు. లేదంటే ఓటీటీలో చూడొచ్చులే అని లైట్ తీసుకుంటాడు. ఇష్టారీతిన ఎక్కువ ధరలు పెట్టేస్తే.. ప్రేక్షకుడు ఓటీటీ వైపు మొగ్గు చూపే అవకాశముంటోంది. అందుకే ఏ చిత్రానికి ఎంత టికెట్ రేటు పెట్టాలనే విషయంలో నిర్మాతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద నష్టం తప్పదు. మనమెంత సంపాదించామన్న దాని కన్నా.. ప్రేక్షకుడ్ని థియేటర్కు ఎంత దగ్గరగా ఉంచామన్నది ఆలోచించాలి.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్ పోస్ట్..
తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన సంఘటనను దర్శకుడు నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. స్వప్నదత్, ప్రియాంక దత్లతో దిగిన ఫొటోను పంచుకున్నారు. -
జులైలో అలరించనున్న చిత్రాలివే.. సీక్వెల్తో కమల్.. యాక్షన్తో ధనుష్
జులైలో విడుదల కానున్న సినిమాల వివరాలివి. ఏ వారంలో ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సుధీర్ బాబు..
సుధీర్ బాబు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది రూపొందనుంది. -
‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి మాస్ సాంగ్ ‘స్టెప్ మార్’ వచ్చేసింది
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో స్టెప్మార్ అంటూ అదరగొట్టారు రామ్. పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకుడు.
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..
విక్రమ్ నటిస్తోన్న ‘తంగలాన్’ (Thangalaan) అప్డేట్ను మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ షేర్ చేశారు. త్వరలోనే ట్రైలర్ రానున్నట్లు తెలిపారు. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రెండు కొత్త చిత్రాల షూటింగ్ షురూ.. అవేంటంటే!
‘యుఫోరియా’ (Euphoria) షూటింగ్ను గుణశేఖర్ ప్రారంభించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్ ఆడియన్స్కు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. -
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్ పోస్ట్..
-
దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
-
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
-
క్రెడిట్ కార్డే కాదు.. కరెంట్ బిల్లు చెల్లింపులూ ఆ యాప్స్లో కుదరవ్..!
-
జులైలో అలరించనున్న చిత్రాలివే.. సీక్వెల్తో కమల్.. యాక్షన్తో ధనుష్
-
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా