Boyapati Srinu: బోయపాటి లైనప్‌.. తదుపరి చిత్రాలు ఈ స్టార్స్‌తోనే..!

‘స్కంద’ తర్వాత తాను చేయనున్న సినిమాల గురించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్పందించారు. స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్నానని తెలిపారు.

Published : 07 Oct 2023 15:39 IST

హైదరాబాద్‌: మాస్‌, యాక్షన్‌ కథాంశాలతో సినిమాలు తీర్చిదిద్ది ప్రేక్షకులను అలరిస్తుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu). బాలకృష్ణ,  అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి నటులతో ఆయన ఇప్పటికే సినిమాలు తెరకెక్కించారు. ఇటీవల ‘స్కంద’తో మెప్పించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ‘అఖండ 2’ గురించీ మాట్లాడారు.

‘‘సూర్య, అల్లు అర్జున్‌తో త్వరలో సినిమాలు చేయనున్నా. ఎవరి డేట్స్‌ ముందు దొరికితే వాళ్లతో మొదట సినిమా చేసేస్తా. ఈ రెండూ పూర్తయ్యాక ‘అఖండ 2’ పట్టాలెక్కిస్తా. మహేశ్‌బాబుతో ఇప్పటికే పలు కథల గురించి చర్చించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల మా ఇద్దరి కాంబోలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. మహేశ్‌.. అన్నిరకాలు పాత్రలు పోషించగల ఆల్‌ రౌండర్‌. ఆయనతో తప్పకుండా ఒక కమర్షియల్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తా’’ అని ఆయన చెప్పారు. బోయపాటి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Varuntej-Lavanya: చిరంజీవి నివాసంలో మొదలైన ప్రీవెడ్డింగ్‌ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

మరోవైపు, అల్లు అర్జున్‌ - బోయపాటి కాంబోలో ఇప్పటికే ‘సరైనోడు’ తెరకెక్కి హిట్‌ అందుకుంది. ‘అఖండ’ విషయానికి వస్తే.. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమా 2021లో విడుదలై విజయాన్ని అందుకుంది. ఇక, బోయపాటి శ్రీను తెరకెక్కించిన రీసెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్కంద’. రామ్‌ హీరోగా శ్రీలీల కథానాయికగా నిర్మించిన చిత్రం సెప్టెంబర్‌ 28న విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని