- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
kalki 2898 ad: ఆయనే ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టారు
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!
ఇంటర్నెట్డెస్క్: ‘వైజయంతీ మూవీస్’ (vyjayanthi movies) బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు అశ్వనీదత్. ప్రస్తుతం కుమార్తెలతో కలిసి భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్పై తాజాగా విడుదల కానున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సిద్ధమైంది. అసలు ‘వైజయంతీ మూవీస్’ ఎలా పుట్టింది? ఎవరు ఆ పేరు పెట్టారంటే..
అశ్వనీదత్కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. సినిమాలపై ఉన్న మక్కువతోనే తండ్రిని ఒప్పించి నిర్మాణ రంగంవైపు వచ్చారు. అలా 19ఏళ్ల వయసులో సావరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ఓ సీత కథ’ తీశారు. అప్పుడే తన అభిమాన నటుడు ఎన్టీఆర్తో సినిమా తీయాలని అనుకున్నారు. ఓ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి, విషయం చెప్పారు. అది విని ఆయన ఆశ్చర్యపోయారట. ‘ఒకే అంతదూరం నుంచి మంచి సినిమా తీయడానికి వచ్చావు. బాగుంది. ఇంత చిన్న వయసులో సినిమా తీస్తున్నావు గ్రేట్. కానీ, నాతో సినిమా ఏంటి? అసలు నా సినిమా మార్కెట్ ఏంటో నీకు తెలుసా?’ అన్నారట. ‘నాకవన్నీ తెలియదు. మీతో సినిమా తీయాలంతే’ అని అశ్వనీదత్ అనడంతో ఎన్టీఆర్ నవ్వి ఊరుకున్నారు.
అలా రెండు, మూడు సార్లు ఎన్టీఆర్ను కలిసి సినిమా ప్రతిపాదన చెబితే, అశ్వనీదత్ పట్టుదల చూసి, ‘బాపయ్య అని మంచి కుర్రాడున్నాడు. నువ్వెళ్లి కలువు’ అని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు కె.బాపయ్య, ఎంఎస్రెడ్డిలను పిలిచి సినిమా తీసే ఏర్పాటు చేశారు. ఇక కాల్షీటుపై సంతకం పెడుతూ, ‘సంస్థకేం పేరు పెట్టారు’ అని అడిగితే, ‘కృష్ణుడి మీద పెట్టాలనుకుంటున్నాను. మీరే పెట్టండి’ అని అశ్వనీదత్ అనడంతో కృష్ణుడి మెడలో వైజయంతిమాల ఉంటుంది కదా! దాని గుర్తుగా ఎన్టీఆర్ తన స్వహస్తాలతో ‘వైజయంతీ మూవీస్’ అని రాశారు. అలా ‘ఎదురులేని మనిషి’ ప్రారంభమైంది. ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదే చిత్రాన్ని ‘జానీ మేరే నామ్’ పేరుతో దేవానంద్ హిందీలో రీమేక్ చేశారు. ఇక రెండో సినిమా కూడా వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్తోనే తీయడం గమనార్హం. కె.బాపయ్య దర్శకత్వంలోనే ‘యుగ పురుషుడు’ తీసి రికార్డు సృష్టించారు. అలా మొదలైన ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాదు, సినీ నిర్మాణ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని, విజయపథంలో ముందుకు సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో వెయిటర్గా నాజర్.. చిరంజీవికి విషయం తెలియడంతో..
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్లో వెయిటర్గా పనిచేశారట సినీ నటుడు నాజర్.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
తానెందుకు సినిమాటిక్ యూనివర్స్లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. -
అరవింద స్వామి మంచంపై.. రజనీ నేలపై..!
దళపతి సినిమా చిత్రీకరణ సందర్భంగా నేలపై పడుకున్న రజనీకాంత్ను చూసి అరవిందస్వామి షాకయ్యారు. -
కమల్ స్థానంలో మోహన్లాల్.. షారుక్ ప్లేస్లో అజయ్ దేవ్గణ్
తాను గతంలో తెరకెక్కించిన ఓ సినిమాకు సంబంధించి దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అదే సినిమా అంటే? -
‘జెర్సీ’ రైల్వేస్టేషన్ సీన్.. సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఏం జరిగిందంటే?
‘జెర్సీ’ మూవీ ట్రైన్ సీన్ వెనుక చిత్ర బృందం పడిన కష్టాన్ని నాని ఓ సందర్భంలో పంచుకున్నారు. -
లక్ష్మీపతి పాత్ర ఆయనతో వేయిద్దామన్నారు!
కోట శ్రీనివాసరావు పోషించిన వైవిధ్యమైన పాత్రల్లో ‘అహ నా పెళ్ళంట’ మూవీలోని లక్ష్మీపతి క్యారెక్టర్ ఎవర్గ్రీన్ -
‘అవును’లో విజయ్ దేవరకొండను అనుకున్నా కానీ..: రవిబాబు
తాను దర్శకత్వం వహించిన ‘అవును’లో హీరో క్యారెక్టర్ కోసం ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నానని దర్శకుడు రవిబాబు తెలిపారు. -
పార్వతి పాత్రను కోల్పోయిన షావుకారు జానకి
చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎలా, ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్క సినిమా చాలు నటుల జీవితాలు మారిపోవడానికి. ‘షావుకారు’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించారు జానకి. -
‘అబీబీ అబీబీ’ బీట్కు ఆ పాటే మూలం!
చిరంజీవి సినిమాల్లోని పాటల్లో కొన్ని గీతాలకు ప్రత్యేక స్టెప్లు వేశారు. అలాంటి వాటిలో ‘హిట్లర్’లో ‘నడక కలిసిన నవరాత్రి’ ఒకటి. -
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్
Allu Arjun: ఓ పొగాకు ఉత్పత్తుల సంస్థకు సంబంధించిన ప్రకటనను అల్లు అర్జున్ తిరస్కరించిన విషయం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. -
ఎన్టీఆర్ హనుమంతుడిగా ఎందుకు చేయలేదంటే!
తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. -
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన గతంలో కొన్ని సినిమాలను చేయలేకపోయారు. అవి బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంగతులు మీకోసం.. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఖాతాదారు డబ్బు మాయం... యూనియన్ బ్యాంకుకు జరిమానా
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
-
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్
-
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
-
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్