- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
kalki tickets: టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్
టికెట్ రేట్ల వ్యవహారంలో అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు
హైదరాబాద్: ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి వస్తున్న వార్తలపై సినీ నిర్మాత అశ్వనీదత్ (aswini dutt) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan kalyan) గారి అభిలాష. దీనిపై నిర్మాతలంతా కూర్చొని, కూలంకషంగా చర్చించమని సూచన చేశారు. సినిమా బడ్జెట్ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవచ్చో ఒక నిర్ణయానికి రమన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబునాయుడు గారితో (Chandra babu naidu) మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాలు, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు’’ అని అశ్వనీదత్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టికెట్ రేట్లపై వచ్చిన అనవసర ఊహాగానాలకు తెరపడినట్లు అయింది.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం చిత్ర బృందం విజయాన్ని ఆస్వాదిస్తోందని, త్వరలోనే పార్ట్-2కు సంబంధించిన పనులు మొదలు పెడతామని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల తెలిపారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మూవీని తీసుకురానున్నట్లు తెలిపారు. తొలి భాగాన్ని మించేలా విజువల్స్ ఉంటాయని అన్నారు. పార్ట్-2లో కమల్, ప్రభాస్ నేపథ్యంలో సాగే డ్రామా సినిమాకే హైలైట్గా నిలుస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈతరం సినిమా భారతీయుడు 2
భారతీయుడు 2’తో సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్హాసన్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని శంకర్ తెరకెక్కించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు ఇది కొనసాగింపు. -
మరొకటి ముగించారు!
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. -
వాస్తవికతకు దగ్గరగా ఉన్న పాత్ర అది
‘నన్ను ప్రభావితం చేసిన పాత్రల్లో ‘జబ్ వీ మెట్’లో గీత్ పాత్ర కూడా ఉంది’ అంటోంది బాలీవుడ్ కథానాయిక తాప్సి. గతేడాది ఒకే చిత్రం ‘డంకీ’తో సరిపెట్టుకున్న ఈమె ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. -
చారు.. నేరుగా మీ హృదయాల్లోకే!
కథానాయకుడు నాని.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. -
డిటెక్టివ్ రూహి
‘గులాబీ’లో ఆటోవాలాగా కనిపించనున్న బాలీవుడ్ భామ హుమా ఖురేషీ, ఇప్పుడు డిటెక్టివ్ రూహి పాత్ర పోషించనుంది. వికాస్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బయాన్’లో తను ఆ విధంగా కనిపించనుంది. -
బచ్చల మల్లి.. డబ్బింగ్కు శ్రీకారం
‘బచ్చల మల్లి’గా బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. -
కొత్త నేపథ్యంతో.. తుఫాన్
ఇటీవలే ‘లవ్గురు’తో ప్రేక్షకుల్ని అలరించారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన ‘తుఫాన్’తో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ మిల్టన్ తెరకెక్కించారు. -
టైటానిక్ నిర్మాత కన్నుమూత
‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి ఆల్ టైం గ్రేట్ హాలీవుడ్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ (63) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
ఫహాద్ డబ్బింగ్ షురూ..
‘జైలర్’తో హిట్ కొట్టి జోరుమీదున్నారు అగ్రకథానాయకుడు రజనీకాంత్. త్వరలో ‘వేట్టయాన్’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజే జ్ఞానవేల్ రాజా తెరకెక్కిస్తున్నారు. -
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
ఇన్స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్
Nabha Natesh: ‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ విడుదల వేడుకలో కథానాయిక నభా నటేశ్ మాట్లాడారు. తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు.