- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Allari Naresh: నీ బొమ్మ ఎన్ని జన్మలకైనా చెరగదులే!
‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాత.
‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఈ చిత్ర తొలి గీతాన్ని సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. ‘‘ఓయమ్మా కొంచెం ఆగవే.. మనసే చెప్పే మాటని పూర్తిగ వినరాదే.. నీ బొమ్మ మదిలో ఉన్నదే.. ఎన్ని జన్మల జన్మలకైనా చెరగదులే’’ అంటూ సాగుతున్న ఈ పాటకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. భాస్కరభట్ల సాహిత్యమందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సూర్య.
తెలంగాణ లగ్గం
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా రమేష్ చెప్పాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లగ్గం’. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఇది వరకు తెలుగు సంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్తో చాలా చిత్రాలొచ్చాయి. ఇది వాటికి భిన్నంగా తెలంగాణదనం ఉట్టిపడే విధంగా ఉండనుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో తెలంగాణ పెళ్లిని కనులవిందుగా చూపించనున్నాం’’ అన్నారు దర్శకుడు రమేష్. నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది కొన్నితరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుంద’’న్నారు. ఈ సినిమాకి సంగీతం: చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి.
ఆమెను హత్య చేసిందెవరు?
‘‘ప్రేమకథతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. ఈ కథ చాలా కొత్తగా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సత్యరాజ్. ఆయన దర్శకత్వంలో రవితేజ నున్నా, నేహా జురెల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ నున్నా మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథానాయికను ఎవరు హత్య చేశారనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కోసం రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను’’ అన్నారు. ‘‘నేను ఓసారి కేరళ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎక్కడో జరిగిన కులాల పోట్లాట గురించి చుట్టూ ఉన్న వారు మాట్లాడుకోవడం విన్నాను. ఆ ఘటనతో ఒక ఊరే తగలబడిపోయినట్లు తెలిసింది. దాన్ని నేను అమలాపురం నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకొని ఈ కథ సిద్ధం చేశాను. రెండు కుటుంబాల మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందింది. దీంట్లో ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదు. ఈ కథలో ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. అది తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోతారు’’ అన్నారు దర్శకుడు సత్యరాజ్. ఈ చిత్రానికి రోషన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
అసలు హంతకుడెవరు?
ఒక క్లబ్లో జరిగిన హత్య.. ఏడుగురు అనుమానితులు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ భవానీ సింగ్ రంగంలోకి దిగుతాడు. సరదా సన్నివేశాలతో మొదలైన కథ.. ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని మలుపులకి గురవుతుంది. ఇంతకీ అసలు హంతకుడెవరన్న సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగింది. సారా అలీఖాన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, సంజయ్కపూర్, డింపుల్ కపాడియాలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘మర్డర్ ముబారక్’ ట్రైలర్ విశేషాలివి. ఈ క్రైమ్ థ్రిల్లర్ని హోమీ అదజానియా తెరకెక్కిస్తున్నారు. దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
‘కల్కి’ని ఆదరించినందుకు అమెరికన్ ఆడియన్స్కు నాగ్ అశ్విన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. -
కొత్త రూపు... తారల ముందు చూపు
ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. -
ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి!
ఇటీవలే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేశ్. ఇప్పుడు ‘బచ్చల మల్లి’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. -
ఎన్టీఆర్ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్
ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. -
ఈటీవీలో రెండు సరికొత్త సీరియల్స్
ప్రతి మధ్యాహ్నాన్ని మరింత వినోదభరితంగా మార్చేందుకు మరో రెండు సరికొత్త సీరియల్స్ను తీసుకొచ్చింది మీ ఈటీవీ. మనసుకు హత్తుకునే విధంగా రూపొందిన ‘వసంతకోకిల’ మధ్యాహ్నాం 1.30గం.కు, ‘కాంతార’ మ.2గం.కు సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం కాబోతున్నాయి. -
సెట్లోకి వస్తే కెమెరానే మా లోకం
‘దృశ్యం’, ‘భోళా’, ‘దే దే ప్యార్ దే’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి హిట్ జోడీ అనిపించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, టబు. -
సుధా కొంగర దర్శకత్వంలో ధనుష్?
‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దర్శకురాలు సుధా కొంగర. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు రీమేక్గా రూపొందింది. -
నటికి ఇంతకన్నా ఏం కావాలి?
‘‘అభిమానులు నా పని గురించే మాట్లాడాలనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక’’ అని అంటోంది అందాల తార త్రిప్తి దిమ్రీ. ‘యానిమల్’తో హిట్ అందుకున్న ఈ భామ..త్వరలో ‘బ్యాడ్ న్యూజ్’ అనే కామెడీ ఎంటర్టైనర్తో రావడానికి ముస్తాబవుతోంది. -
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మైథాలాజిక్, సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
కల్కి మూవీలో తన పాత్ర గురించి నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం