- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nagarjuna: ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు.
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం నాగార్జున గొప్పతనం. ఎన్నో విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని పంచుతున్న ఆయన (Nagarjuna) తాజాగా ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సినిమాలో సంగీతానికి, సాహిత్యానికి మీరు ఎలాంటి ప్రాముఖ్యతనిస్తారు?
నాగార్జున: సంగీతం కేవలం సినిమాలోనే కాదు.. జీవితంలోనూ ఓ భాగం. మ్యూజిక్ను ఆస్వాదించగలిగితే జీవితంలో ఎప్పుడూ ఒంటరితనం దరి చేరదు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని చూస్తే అసూయగా అనిపించేది. సాహిత్యాన్ని అంత గొప్పగా ఎలా రాసేవారో అర్థమయ్యేది కాదు. నాకు సంగీతమంటే ఇష్టం. ఖాళీ సమయంలో ఎప్పుడూ మ్యూజిక్ వింటుంటాను.
శాస్త్రిగారితో మొదటిసారి ఎప్పుడు వర్క్ చేశారు?
నాగార్జున: నేను, శాస్త్రిగారు ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చాం. నన్ను హీరో అని పిలిచేవారు. ‘సంకీర్తన’లో ‘వే వేలా వర్ణాల’ పాటను ఆయన రాశారు. అది నా రెండో సినిమా.
ఆయన్ని మొదటిసారి ఎప్పుడు కలిశారు?
నాగార్జున: మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తులేదు. కానీ, ‘శివ’ సమయంలో క్లోజ్ అయ్యాం. ఆ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆ చిత్రంలోని పాటల కోసం ఆయనతో మాట్లాడాను.
‘కల్కి’లో ప్రభాస్, కమల్హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
శాస్త్రిగారిలో మీకు నచ్చే విషయం ఏంటి?
నాగార్జున: ఆయన మాట్లాడుతుంటే చిన్న పిల్లాడు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా పాటలు రాసేవారు. ‘శివ’లో ‘బోటనీ క్లాసు ఉంది’ పాట చాలామందికి ఫేవరెట్. దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. సులువైన పదాలతో రాసినా.. లోతైన అర్థం ఉంటుంది. ‘శివ’లోనే ‘సరసాలు చాలు శ్రీవారు’ అని మరో పాట రాశారు. భార్యాభర్తలంతా దానికి కనెక్ట్ అవుతారు. ఆయనకు ప్రపంచంలో జరిగే చాలా విషయాలపై అవగాహన ఉండేది. అన్నిటి గురించి తెలుసు కాబట్టే అంత అద్భుతంగా రాసేవారు.
‘అంతం’లోని ‘నీ నవ్వు చెప్పింది నాతో’ పాటకు సంబంధించిన అనుభవాలు గుర్తున్నాయా?
నాగార్జున: అనుభవాలంటూ ప్రత్యేకంగా లేవు. దర్శకులతో, రచయితలతో నేను పర్సనల్గా పాటల గురించి మాట్లాడతాను. ‘క్రిమినల్’లోని ‘తెలుసా మనసా’ పాటను దగ్గర కూర్చొని రాయించుకున్నా. ఆ సినిమా దర్శకుడికి తెలుగు రాదు. అందుకే ఆ పాట సందర్భాన్ని శాస్త్రి గారికి (sirivennela sitarama sastry) నేను వివరించాను. ఆయనెప్పుడు రాత్రి పూటే రాసేవారు. దీంతో మూడు రోజులు ఆయనతో ఉండి ఆ పాట రాయించుకున్నా. ఇవే లిరిక్స్ను హిందీలో రాయాలని కొందరు ప్రయత్నించారు కానీ, సాధ్యపడలేదు.
‘నిన్నే పెళ్లాడతా’లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ విశేషాలు పంచుకుంటారా?
నాగార్జున: బ్యూటీఫుల్ సాంగ్. లిరిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇదే సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ నాకు ఇష్టమైన పాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు. -
విన్న కథలు 500.. చేసింది 50
పాత్రలో జీవించడం ఎలాగో తెలిసిన నటుడు విజయ్ సేతుపతి. అందుకే ఆయన నటించిన సినిమాలు చూస్తే తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప, ఆయన కనిపించడు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే... మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతుంటారు. -
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను శనివారం నిర్వహించారు. -
మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే!
తొలి సినిమా నుంచే ఎక్స్ప్రెస్ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి. -
‘సత్యభామ’ చేసినందుకు గర్వంగా ఉంది: కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తాజా చిత్రం ‘సత్యభామ’. జూన్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. -
మహేశ్బాబుతో మల్టీస్టారర్.. సుధీర్ బాబు ఏమన్నారంటే
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. తాజాగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. -
ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా?: రష్మిక
ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
రేవ్ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మి.. ఏమన్నారంటే
చాలా రోజుల తర్వాత ‘యక్షిణి’ వెబ్ సిరీస్తో అలరించడానికి సిద్ధమయ్యారు నటి మంచు లక్ష్మి. తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. -
నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ
నటి లయ (Laya) తాజాగా ‘ఆలీతో సరదగా’ కార్యక్రమలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్కు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.