AI: ఏఐ వాయిస్‌తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ

ఏఐ సాంకేతికత ద్వారా ఫోన్లో పురుషుడిలా వాయిస్‌ మార్చి పొరుగింటి యువతిని మోసం చేసింది ఓ మహిళ. బాధితురాలి నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. 

Published : 29 Jun 2024 16:27 IST

ముంబయి: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్నిరంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు తెర లేపుతున్నారు. తాజాగా ఓ మహిళ ఏఐ ద్వారా పురుషుడిలా వాయిస్‌ మార్చి మరో యువతిపై బెదిరింపులకు దిగింది. ఆమె నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

థానే జిల్లాకు చెందిన ఓ మహిళ ఏఐను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడింది. పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడింది.  ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్‌ చేసింది. అలా రూ.6 లక్షలకు పైగా దోపిడీ చేసింది.

మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్‌ వైరల్‌

వేధింపులు తాళలేని బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో ఇదంతా చేసింది పొరుగింటి మహిళ అని తెలిసి అంతా షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం ఆ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని