- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Viral video: 5-స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన మహిళ.. వీడియో వైరల్
దుబాయ్లోని 5-స్టార్ హోటల్ బాల్కనీలో ఓ మహిళ దుస్తులు ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్లోని 5-స్టార్ రిసార్ట్(5-star resort)లో ఓ మహిళ తాము బుక్ చేసుకున్న గది బాల్కనీలో దుస్తులు ఆరేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాము ఫ్యామిలీ హాలిడేకు దుబాయ్(Dubai)కి వచ్చామని, ఇక్కడి ప్రముఖ రిసార్ట్ అట్లాంటిస్, ది పామ్(Atlantis, The Palm)లో బస చేశామని పల్లవి వెంకటేష్ అనే వ్యక్తి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
వీడియోలో తన తల్లి బీచ్ రిసార్ట్లోని గది బాల్కనీలో దుస్తులు ఆరబెడుతుండగా ‘‘ఈ అమ్మలు ఉన్నారే.. పామ్ అట్లాంటిస్లోనూ తమ పనులు వదలరు’’ అంటూ ఆ వీడియోకు వ్యాఖ్యను జత చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఆ రిసార్ట్ నిర్వహకులు స్పందిస్తూ ‘‘ఇవి అమ్మలందరికీ ఉండే పనులు. మా హోటల్లో బస చేయడం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం! మేము ప్రతి బాత్రూమ్లో దుస్తులు ఆరబెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశాం. అక్కడే ఆరబెట్టుకోవచ్చు’’ అని తెలిపారు.
మహిళ చేసిన పనిని కొందరు నెటిజన్లు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.“మన దేశంలో అయితే ఇలా చేయవచ్చు. ఇతర దేశాల్లో ఇలా ప్రవర్తిస్తే అమర్యాదగా భావిస్తారు” అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘ఇందులో తప్పేముంది? అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. -
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఏం మారనట్లుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. -
భాజపాపై విరుచుకుపడ్డ హేమంత్ సోరెన్
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు గుణపాఠం నేర్పారని ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. -
బిహార్లో వరుస వంతెన ప్రమాదాలు.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై తేజస్వీ విమర్శలు
బిహార్లో వరుస వంతెన ప్రమాదాలపై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. -
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. -
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
BJP: గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో టెంట్ కూలిన ఘటనపై భాజపా స్పందిస్తూ కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. దీనికి నెహ్రూను నిందించొద్దంటూ కౌంటర్ పోస్ట్ చేసింది. -
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
ఏఐ సాంకేతికత ద్వారా ఫోన్లో పురుషుడిలా వాయిస్ మార్చి పొరుగింటి యువతిని మోసం చేసింది ఓ మహిళ. బాధితురాలి నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. -
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మమ్మల్ని జైల్లో వేయించారేగానీ..: లాలూ ప్రసాద్ యాదవ్
గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ నేతల నోట ఎమర్జెన్సీ పదం విరివిగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. -
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
ఠాణెలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలుడి కాలుకు బదులు అతడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. -
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు. -
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాడు దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
తాగుడుకు బానిసైన (drinking habit) తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు భార్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాగుడును ఇలా మాన్పించాలంటూ ఓ మంత్రి చేసిన సూచన వైరల్గా మారింది. -
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
Ladakh: లద్దాఖ్లో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. -
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు