- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bhole Baba: ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలవడం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలేమిటీ కార్యక్రమం? భారీ సంఖ్యలో మరణాలకు కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే..
యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి.. సాకార్ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి.. ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.
వేల సంఖ్యలో భక్తులు..
అలీగఢ్తోపాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్ప్రదేశ్ కాకుండా ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఊపిరాడకే..
తాజాగా అక్కడి ఫుల్రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబాను ఇంకా అరెస్టు చేయకపోవడంపై పోలీసులు స్పందించారు. -
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్టీఏను ఆదేశించాలని కోరుతూ 56 మంది నీట్ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు ఓవైపు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రులకు పరుగులు తీయడం మరోవైపు.. తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదంటూ అధికారులను పలువురు ప్రాధేయపడుతున్న యూపీలోని దృశ్యాలు కలిచివేస్తున్నాయి. -
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. -
పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు. -
ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!
తాను బాధ్యత వహించిన స్థానాల్లో భాజపా ఓడిపోవడంతో రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. -
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి భోలే బాబా అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం. -
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చరిత్ర సృష్టించి.. సవాళ్ల నడుమ ‘సునాక్’ ప్రయాణం!
-
ఏడాదిలోనే థ్రెడ్స్కు 175 మిలియన్ల యూజర్లు.. భారత్లోనే అధికం
-
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సీనియర్నేత కేకే నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మంచిదే: రేవంత్రెడ్డి
-
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్