- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bhole Baba: జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలను తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా (Bhole Baba)’ను అనుసరించేవారి నమ్మిక ఇది. అందుకే ఆయన పాద ధూళి కోసం ఎగబడిన భక్తులు దురదృష్టవశాత్తూ అదే మట్టిలో కలిసిపోయారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హాథ్రస్ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనతో ఈ బాబా పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఇంతకీ ఎవరాయన? పోలీసు శాఖలో పనిచేసి.. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన వ్యక్తి బాబాగా ఎలా మారాడు?
18 ఏళ్ల పాటు పోలీసుశాఖలో..
యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి.. సాకార్ విశ్వ హరి, ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. అతడి అసలు పేరు సూరజ్ పాల్. ఎటా జిల్లా పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన అతడు.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. చదువు పూర్తయిన తర్వాత రాష్ట్ర పోలీసు శాఖలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు.
లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లి..
అయితే, పోలీసు శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరజ్ పాల్ కొన్ని కేసులు ఎదుర్కొన్నట్లు యూపీ పోలీసు వర్గాలు తెలిపాయి. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో 1997లో అరెస్టయి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడట..! ఆ తర్వాత బయటకు వచ్చి తన పేరును ‘సాకార్ విశ్వ హరి బాబా’గా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరిచాడు. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.
నీళ్ల కోసం భక్తుల క్యూ..
అలీగఢ్తోపాటు హాథ్రస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తుంటారు. ఉత్తర్ప్రదేశ్ కాకుండా ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఇతడి కార్యక్రమాలను నిర్వహించే వారు నల్లటి దుస్తులు ధరించి ఎన్ఎస్జీ కమాండో మాదిరిగా ఉంటారు. వీరిని ‘సేవాదర్ ఆర్మీ’గా పిలుస్తుంటారు.
సాధారణంగా ఆశ్రమంలో నిర్వహించే సత్సంగ్ కార్యక్రమాల్లో భక్తులకు నీటిని పంపిణీ చేస్తుంటారు. అవి తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అతడి ఆశ్రమంలో ఓ చేతిపంపు ఉంటుంది. దాన్ని పవిత్ర జలంగా భావించి ఆ నీరు తీసుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు.
ఎప్పుడూ తెల్లటి దుస్తులే..
భోలే బాబా ఎప్పుడూ తెల్లటి సూట్ ధరించి టోపీ పెట్టుకుని కన్పిస్తాడు. ఏ కార్యక్రమానికి వచ్చినా భార్య వెంట ఉండాల్సిందే. కొవిడ్ సమయంలో అతడి పేరు తొలిసారిగా దేశమంతా వినిపించింది. ఆ సమయంలో సత్సంగ్ కార్యక్రమం కోసం 50 మంది భక్తులు వస్తారని ఆర్గనైజర్లు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ, ఆ కార్యక్రమానికి ఏకంగా 50వేల మంది రావడం అప్పట్లో వివాదస్పదమైంది.
పాదధూళి కోసం వెళ్లి..
హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు 80వేల మందికి పోలీసులు అనుమతినిచ్చారు. కానీ, బాబా దర్శనం కోసం ఏకంగా 2.5లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంటన్నర పాటు భోలే బాబా ప్రవచనాలు పూర్తయిన తర్వాత కారులో వెళ్లిపోయాడు. ఆయన వాహనం వెళ్లి మార్గంలోని మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్వాదం లభించినట్లేనని విశ్వసించిన భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుని కిందపడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి పెను విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు ఓవైపు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రులకు పరుగులు తీయడం మరోవైపు.. తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదంటూ అధికారులను పలువురు ప్రాధేయపడుతున్న యూపీలోని దృశ్యాలు కలిచివేస్తున్నాయి. -
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. -
పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు. -
ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!
తాను బాధ్యత వహించిన స్థానాల్లో భాజపా ఓడిపోవడంతో రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. -
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి భోలే బాబా అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం. -
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. -
నీట్ అక్రమాలపై శిరోముండనంతో నిరసన
‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
-
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
-
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే.. ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది!
-
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్
-
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?