Saket gokhale: పరువు నష్టం కేసులో ఎదురు దెబ్బ.. ఎంపీకి 50లక్షల జరిమానా

పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది.

Published : 01 Jul 2024 18:46 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్(TMC) రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే(Saket Gokhale)కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. 

గతంలో దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన లక్ష్మి పూరి (Lakshmi Puri) స్విట్జర్లాండ్‌(Switzerland)లో ఆదాయానికి మించిన ఆస్తులు కొనుగోలు చేశారని 2021 జూన్‌లో సాకేత్ గోఖలే సోషల్‌ మీడియాలో పలుమార్లు ట్వీట్లు పెట్టారు. ఆమె భర్త మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై సైతం ఆరోపణలు చేశారు. దీంతో లక్ష్మిపూరి టీఎంసీ ఎంపీపై పరువు నష్టం కేసు వేశారు. తన ఆదాయం గురించి సాకేత్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.  దీనిపై విచారణ అనంతరం తాజాగా తీర్పు వెలువరించిన దిల్లీ హైకోర్టు మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని సాకేత్ గోఖలేను ఆదేశించింది.  ప్రముఖ జాతీయ వార్తా పత్రికలో బహిరంగ క్షమాపణ కోరుతూ ప్రకటన విడుదల చేయాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని