- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది.
దేహ్రాదూన్: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ను (Uttarakhand) వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్ (Champawat), అల్మోరా (Almora), పిథోర్గఢ్ (Pithoragarh), ఉధమ్సింగ్ నగర్తోపాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారంరోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దేహ్రాదూన్ (Dehradun), తేహ్రి (Tehri), హరిద్వార్ (Haridwar) తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా (Ganga), అలకనంద (Alaknanda), భాగీరథీ (Bhagirathi), శారద (Sarada), మందాకిని (Mandakini), కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు.
నీట మునిగిన శివుడి విగ్రహం
గత 24 గంటల్లో అల్మోరాలోని చౌకుతియా ప్రాంతంలో 72.5 మి.మీ వర్షపాతం నమోదైంది. లోహఘట్లో 59 మి.మీ, చంపావత్లో 45 మి.మీ, కాశీపుర్లో 42 మి.మీ, హల్ద్వానీలో 31 మి.మీ వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటుచేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. ఈనేపథ్యంలో అక్కడి వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నిలిచిన రాకపోకలు
నైనీతాల్, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి విపత్తు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జిల్లా మెజిస్ట్రేట్స్ ఆదేశించారు. గంగా, సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తుండగా.. అలకనంద, మందాకిని, భాగీరథీ నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి. మరోవైవు గోమతి, కాళీ, గౌరీ, శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా, తవాఘాట్ జాతీయ రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!
అమితమైన ప్రేమ, అంతులేని బాధ, వెలకట్టలేని త్యాగం.. కలగలిపి ఈ దృశ్యం. దీని వెనుక కన్నీటి కథ తెలిస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. -
అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి: ఆర్మీ
అగ్నిపథ్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న అగ్నివీరుల వయోపరిమితి, సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లుగా సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఒక విద్యాసంస్థకు చెందిన ప్రిన్సిపల్ను బయటకు పంపినతీరు విమర్శలకు దారితీసింది. -
అనంత్- రాధిక సంగీత్లో టీ20 హీరోలకు గ్రాండ్ వెల్కమ్
Anant - Radhika: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో టీ20 ప్రపంచకప్ హీరోలకు అరుదైన గౌరవం లభించింది. -
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని కారణంగా 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. -
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
Landslides: ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. వారు వెళ్తున్న బైక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. -
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాగా తాజాగా మరో కేసు నమోదైంది. -
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
NEET UG counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్లో జరిగిన సత్సంగ్ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. -
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!
-
అవినీతి ఆరోపణలతో సీబీఐకి చిక్కిన గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్
-
అయోధ్య ఫలితం.. గుజరాత్లోనూ రిపీట్: రాహుల్
-
జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
-
వాట్సప్ స్కామ్స్ బారిన పడకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి