- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul vs Rajnath: రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అగ్నిపథ్ పథకంపై లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య మాటల తూటాలు పేలాయి.
దిల్లీ: లోక్సభ సమావేశాలు (Lok sabha Session) వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ను (AgniPath) ‘యూజ్ అండ్ త్రో లేబర్’ పథకంగా రాహుల్ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్నాథ్ సింగ్.. ప్రతిపక్షనేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
‘‘మందుపాతర పేలి ఒక అగ్నివీర్ ప్రాణాలు కోల్పోతే అతడిని అమరవీరుడిగా పరిగణించరు. నేను అమరుడన్నా, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని మోదీ కానీ ఆ పేరుతో పిలవరు. కేవలం అగ్నివీర్గానే గుర్తిస్తారు. అతడి కుటుంబానికి పింఛన్ రాదు. ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వరు. కేంద్రం దృష్టిలో అగ్నివీరులంతా ఉపయోగించుకొని వదిలేసే ఓ లేబర్ లాంటివారు’’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ పథకాన్ని తీసుకొస్తున్నప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగినట్లు ఈ సందర్భంగా రాహుల్ సభకు వివరించారు. ‘‘ మీరు సైనికులను విభజిస్తున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు. మరొకరిని అగ్నివీరుడు అంటున్నారు. ఒకరికి పింఛను వస్తుంది. మరొకరికి రాదు. అగ్నివీరుడు జవాన్గా పిలిపించుకోలేడు. మీరన్నట్లుగా దేశభక్తుడిగానే మిగిలిపోతాడు’’ అంటూ అగ్నివీర్, జవాన్కు మధ్య తేడాలను వివరిస్తూ అధికార పక్షంపై మండిపడ్డారు.
158 సంస్థల అభిప్రాయాలు తీసుకున్నాం: రాజ్నాథ్
రాహుల్ మాట్లాడుతున్న సమయంలో.. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్షా మధ్య కూర్చున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రాహుల్ గాంధీ సభను దప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఓవైపు రాజ్నాథ్ మాట్లాడుతుండగానే.. ‘నేను తప్పు మాట్లాడలేదు.. నేను తప్పు మాట్లాడలేదు’ అంటూ రాహుల్ నిరసన వ్యక్తం చేశారు.
అయితే, రాహుల్.. పరిహారం, పింఛన్పై అభ్యంతరం వ్యక్తం చేయగా.. రాజ్నాథ్ మాత్రం కేవలం పరిహారంపై మాత్రమే సమాధానమిచ్చారు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చే ముందు చాలా ఆలోచించామని, పలువురు నిష్ణాతులు, 158కి పైగా సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీన్ని అమల్లోకి తీసుకొచ్చామని రాజ్నాథ్ వివరించారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం.. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబ సభ్యులు పింఛన్ పొందేందుకు అర్హులు కాదు. అయితే, ఈ సందర్భాల్లో వారి కుటుంబాలకు రెగ్యులర్ జవాన్ల మాదిరిగానే పింఛన్ వెసులుబాటు కల్పించాలని ఫిబ్రవరిలో పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదించింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
యువతను దేశ రక్షణలో భాస్వాములను చేయడమే లక్ష్యంగా 2022లో కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్మీ, నేవీ, వైమానిక విభాగాల్లో నాలుగు ఏళ్ల సర్వీసు కోసం 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు యువకులను దీని కోసం ఎంపిక చేస్తారు. వీరిని అగ్నివీర్లుగా పిలుస్తారు. వీరిలో 25 శాతం మంది సేవలను 15 ఏళ్లకు మించి వాడుకోవచ్చు. మిగతా వారిని ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి సర్వీసు నుంచి రిటైర్మెంట్ ఇస్తారు. అయితే, 25 ఏళ్ల వయస్సులో అగ్నివీర్లను కేంద్రం నిరుద్యోగులుగా మారుస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అంతేకాకుండా స్వల్పకాలిక రిక్రూట్మెంట్ల వల్ల దళాల్లో ఐక్యత కొరవడుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. రెగ్యులర్ సైనికులతో కలిసి పని చేస్తున్నప్పటికీ... వాళ్లతో పోలిస్తే జీతభత్యాలు, పింఛన్ విషయంలో తేడాలు ఉండటం కూడా వారిని ప్రభావితం చేస్తుందని చెబుతోంది. అయితే, నాలుగేళ్ల సర్వీసు ముగింపు సమయంలో అగ్నివీర్లకు మంచి ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నామని, ఆ మొత్తంలో జీవితంలో వారు నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం అంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. -
అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల పశ్చిమబెంగాల్లోని చోప్రాలో ఓ వ్యక్తితోపాటు మహిళను నడిరోడ్డుపై చావబాదిన ఘటన రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. గవర్నర్ ఆనంద్బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ ఆలయానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు దట్టమైన అడవిలో చిక్కుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో 11 గంటల పాటు అక్కడే గడిపారు. -
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తర్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఖర్గే స్థానంలో ‘ఆయన’ ఉంటే బాగుంటుంది.. రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. జగదీప్వ్యాఖ్యలకు బదులిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
ఇటీవల తమ కాలేజీల్లో హిజాబ్పై నిషేధం విధించిన ముంబయిలోని ఓ విద్యాసంస్థ.. తాజాగా చిరిగిన జీన్ ప్యాంట్, టీషర్ట్లపైనా ఆంక్షలు విధించింది. -
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు. -
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది. -
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి అలర్ల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. -
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
నీట్ వివాదంపై దాఖలైన అనేక పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. -
పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!
NEET PG Exam: నీట్ పీజీ 2024 పరీక్షను ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
Vijay Mallya: బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాపై ముంబయి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
-
షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా
-
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?