- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: నాడు ఎమర్జెన్సీ విధించి.. నేడు రాజ్యాంగంపై ‘ప్రేమ’ నాటకాలా?: మోదీ
PM Modi: కాంగ్రెస్పై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదన్నారు.
దిల్లీ: దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్లు పెట్టారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనంటూ హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ (Congress) ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని (Constitution) ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు’’ అని మోదీ (Narendra Modi) నాటి పరిస్థితులను గుర్తుచేశారు.
‘‘నాడు ఎమర్జెన్సీ (Emergency days)ని విధించిన వారికి (కాంగ్రెస్) ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు. ప్రతికా స్వేచ్ఛను నాశనం చేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాజ్యాంగంలోని ప్రతీ అంశాన్ని ఉల్లంఘించారు. నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచిపెట్టి వారు ఇప్పుడు నటిస్తున్నారు. కానీ చేష్టల్లో వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే వారిని తిరస్కరిస్తున్నారు’’ అంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి పలుమార్లు రాజ్యాంగం (Constitution) మార్పు అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చేస్తారని విపక్ష నేతలు ఆరోపించారు. దీన్ని మోదీ సర్కారు ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాల ప్రారంభ సమయంలోనూ రాజ్యాంగ ప్రతులను పట్టుకుని విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. అయితే, ఈ సమావేశాలకు ముందు ప్రధాని మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి దేశ చరిత్రపై మాయని మచ్చ అని, నాటి పొరపాటు భవిష్యత్తులో మళ్లీ జరగొద్దని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్(టాన్)పైనా నిషేధం విధించింది. -
మట్టి రాసిన మరణ శాసనం.. 116 మంది దుర్మరణం
భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
అరుణాచల్ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి
అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు. -
రిలయన్స్ పార్కులో సామూహిక వివాహాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. -
తొక్కిసలాట.. విషాదాలు
దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు, సామాన్యులు దుర్మరణం పాలయ్యారు. -
ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలకు 108 మృతదేహాల వితరణ
మరణానంతరం అవయవదానం చేసేందుకు ముందుకువస్తున్న దాతలను చాలామందిని చూశాం. దేహంలో ఏదో ఒక భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడం ద్వారా కర్ణాటకలోని ఆ గ్రామ ప్రజలు ఆదర్శప్రాయులుగా నిలిచారు. -
నీట్-యూజీని మళ్లీ నిర్వహించాలి
నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. -
కొత్త నేర చట్టాలపై నో కామెంట్
రెండ్రోజుల క్రితం అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతుండగా వాటిపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నిరాకరించారు. -
మా అబ్బాయి మృతిచెందాక..మొత్తం రూ.1.08 కోట్లు అందాయి
విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లా పింపల్గావ్ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్’ అక్షయ్ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి. -
బద్రీనాథ్లో అలకనందకు వరద
ఉత్తరాఖండ్లోని అలకనంద నది తీరంలో జరుగుతున్న తవ్వకాలు బద్రీనాథ్లో వరదలకు దారితీశాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు జరిగిన ఈ పరిణామంతో భక్తులు, -
6 రోజుల ముందే దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు
భారత్కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. మంగళవారం నాటికి అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణం కన్నా ఆరు రోజుల ముందే వీటి విస్తరణ పూర్తికావడం విశేషం. -
ఇదిగో క్రికెట్ చూస్తూ.. నేను హాయిగా ఉన్నా
తీవ్రజ్వరంతో గత వారం ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు, ఆసన్సోల్ (పశ్చిమబెంగాల్) ఎంపీ శత్రుఘ్నసిన్హా (77) తన ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు ఖండనగా కొన్ని చిత్రాలను విడుదల చేశారు. -
అస్సాంను ముంచెత్తుతున్న వరదలు
అస్సాంలో వరదల పరిస్థితి మంగళవారం నాటికి మరింత తీవ్రంగా మారింది. మరో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 11.34 లక్షలమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మతమార్పిళ్లు జరిగే సమ్మేళనాలను నిలిపివేయాలి
మత మార్పిళ్లపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిళ్లు జరుగుతున్న సమ్మేళనాలను వెంటనే నిలిపివేయాలని అభిప్రాయపడింది. -
సంక్షిప్త వార్తలు
18వ లోక్సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే... -
కేజ్రీవాల్ పిటిషన్పై వారంలోగా స్పందించండి
అక్రమాస్తుల కేసును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఏడు రోజుల్లోగా స్పందించాలని సీబీఐని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఆదేశించారు. -
ఆగస్టులో ‘నీట్-పీజీ’
నీట్-పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. -
తొలి పరిభ్రమణాన్ని పూర్తిచేసుకున్న ఆదిత్య-ఎల్1
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య-ఎల్1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్- మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణ్పుర్ జిల్లా కోహ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కుర్రేవాయ్-షుమండి అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు, -
కళాశాల వాష్రూంలో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని
ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కళాశాల వాష్రూంలోనే ప్రసవించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక పోలీసులు తెలిపిన మేరకు.. కోలారు నగర శివార్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో బాలిక (17) పీయూసీ (ఇంటర్మీడియట్) మొదటి సంవత్సరం చదువుతున్నారు. -
‘దిల్లీలో కాలుష్యానికి.. పంజాబ్ రైతులపై చర్యలు అన్యాయం’
పంజాబ్లో పంట వ్యర్థాల దహనం ఘటనలు దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు లేవని ఎన్జీటీ సభ్యుడు జస్టిస్ సుధీర్ అగర్వాల్ తెలిపారు.