- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha: సభకు నమస్కారం.. మాతృభాషకు వందనం
తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె.గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు.
తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ
ప్రమాణస్వీకారం చేస్తున్న కృష్ణగిరి ఎంపీ కె.గోపీనాథ్
ఈనాడు, దిల్లీ: తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె.గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన 18వ లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగులో ‘సభకు నమస్కారం’ అంటూ ప్రారంభించి తెలుగులోనే ప్రమాణం చేశారు. చివరలో నండ్రి, వణక్కం, జై తమిళనాడు అని ముగించారు. తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 2001 నుంచి 2016 వరకు వరుసగా మూడుసార్లు హోసూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగానూ పనిచేశారు.
తెలుగువారు తెలుగులోనే మాట్లాడుకోవాలి
‘మాతృభాషను మరవొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని కోరుతున్నా. మీరు ఎక్కడున్నా స్థానిక భాషలను గౌరవించండి. ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడి భాషను సోదరభాషగా భావించి నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మనం పిల్లలతో తెలుగులో మాట్లాడితే అది తరతరాలకు కొనసాగుతూ పోతుంది. తెలుగువారు ఎక్కడ తారసపడినా తెలుగులోనే మాట్లాడాలని వినయపూర్వకంగా కోరుతున్నా. తమిళనాడులో చాలామంది తెలుగువారు మాతృభాషను ఇష్టపడతారు. కానీ మాట్లాడలేకపోతున్నారు. తాతలనాటి భాష తర్వాతి తరాలకు అబ్బటం లేదు. తప్పు మనలో ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు పిలుపునివ్వాలి
‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగును కాపాడుకోవాలని యావత్ భారతదేశంలో ఉన్న తెలుగువారికి ఒక సందేశం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ మూల ఉన్న తమిళ వ్యక్తికి ఇబ్బంది కలిగినా తమిళ పార్టీలు గొంతెత్తుతాయి. అది తెలుగువారిలో కనిపించకపోవడం బాధాకరం. అలాకాకుండా తెలుగువారు ఎక్కడున్నా అండగా ఉంటామని ఏపీ, తెలంగాణ పాలకులు భరోసా ఇస్తే ఇతర రాష్ట్రాల పాలకులు కూడా అక్కడున్న మనవారి విషయంలో ఆలోచిస్తారు’ అని గోపీనాథ్ పేర్కొన్నారు.
నా మాతృభాషను నేనుకాక ఇంకెవరు గౌరవిస్తారు?
తమిళనాడులో ఉంటున్నప్పటికీ తాను తెలుగువాడిని కాబట్టి మాతృభాషలోనే ప్రమాణ స్వీకారం చేయాలనిపించిందని ఎంపీ గోపీనాథ్ ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ‘నా భాషను నేను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? తమిళనాడులో తమిళ భాషాభిమానం ఉందని మన భాషాభిమానాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో తప్పు కానీ, పక్కవారికి ఇబ్బంది కానీ లేవు. తమిళనాడు అసెంబ్లీలో నేను తెలుగులో మాట్లాడినప్పుడు నాటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానం ఇచ్చారు. నేను తెలుగు మాట్లాడటం వల్లే తమిళ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఉగాదిని సెలవుదినంగా ప్రకటించారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. మద్రాస్ నిజమైన తెలుగు పట్టణం. నేటికీ 40% మంది తెలుగు మాట్లాడతారు. మాకు తమిళం సోదర భాష, తెలుగు తల్లి భాష. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తెలుగులో పాఠ్యపుస్తకాలు అందిస్తోంది’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. -
నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. -
దిల్లీ.. తల్లడిల్లి
భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. -
దిల్లీ విమానాశ్రయ ఘటన.. కేంద్రం కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ’ ఆదేశాలు జారీ చేసింది.