- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET UG-2024: ‘నీట్’పై లోక్సభలో గందరగోళం.. తమిళనాడు కీలక తీర్మానం
దేశ వ్యాప్తంగా వైద్యసీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
చెన్నై: దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పరీక్షకు ముందే పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో.. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతోపాటు విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు.
ఇదే అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని పునరుద్ఘాటించారు. నీట్ పరీక్ష వద్దని తమిళనాడు పదేపదే చెబుతోందని గుర్తు చేసిన ఆమె.. నీట్ నిర్వహణ డొల్ల అని ఇప్పుడు రుజువైందన్నారు. ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ఎంతో కోల్పోతున్నారని పేర్కొన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. ఓ వైపు దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా.. నీట్ పీజీ-2024 పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్