- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RajyaSabha: రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, ధన్ఖడ్ మధ్య మాటల యుద్ధం
నీట్ పేపర్ లీక్పై చర్చ జరపాలంటూ రాజ్యసభలో విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం జరిగింది.
దిల్లీ: నీట్ యూజీ-2024 (NEET UG-2024) పేపర్ లీకేజీ వ్యవహారం ఉభయసభల్లో అగ్గి రాజేస్తోంది. లోక్సభలో (LokSabha) ఈ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్కు సభాపతి నిరాకరించడంతో సభలో గందరగోళం తలెత్తింది. దీంతో సభ జులై 1 (సోమవారం)కి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ (Rajyasabha) ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్నారు. ప్రతిపక్షంపై ఛైర్మన్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నీట్పై చర్చ కోరుతూ తొలుత ఖర్గే, ప్రతిపక్ష సభ్యులతో కలిసి వెల్లోకి దూసుకెళ్లారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధన్ఖడ్.. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్న వ్యక్తులెవరూ వెల్లోకి రాలేదని, ఈ పరిస్థితులను చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు.
దీనిపై స్పందించిన ఖర్గే.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని దాదాపు 10 నిమిషాలపాటు చేతులు ఎత్తుతూనే ఉన్నామని అప్పటికీ పట్టించుకోకపోతేనే వెల్లోకి వచ్చామని చెప్పారు. ‘భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఛైర్మన్ కూడా అదే స్థాయిలో స్పందించారు ‘‘ ప్రతిపక్ష నేత చెప్పినట్లుగా భారత పార్లమెంట్ చరిత్రలో ఇది చీకటి రోజే. ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి వెల్లోకి దూసుకొచ్చారు. ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. నేను షాక్కు గురయ్యా. చాలా బాధనిపించింది. ప్రతిపక్షనేత, ఉపనేత వెల్లోకి దూసుకొచ్చేంత స్థాయికి పార్లమెంట్ సంప్రదాయం దిగజారిపోయింది’’ అంటూ సభను వాయిదా వేశారు.
సభలో తమ గొంతు వినిపించేందుకు ఛైర్మన్ సహకరించడం లేదని, విధిలేని పరిస్థితుల్లోనే వెల్లోకి వెళ్లాల్సి వచ్చిందని ఖర్గే తెలిపారు.‘‘ ఇది పూర్తిగా ఛైర్మన్ తప్పిదం. పార్లమెంట్ నిబంధనల ప్రకారం.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని దాదాపు 10 నిమిషాల పాటు చేతులు ఎత్తాను. కానీ, ఆయన నావైపు అసలు చూడలేదు. సభ్యులంతా వెల్లోకి వెళ్లడంతో.. నేను బయటకి వచ్చేశాను. పార్లమెంట్ నిబంధనల ప్రకారం.. ఎవరైనా సభ్యుడు చేయి ఎత్తితే.. ఛైర్మన్ కచ్చితంగా అతడివైపు చూడాలి. కానీ, ఛైర్మన్ ట్రెజరీ బెంచీలవైపే చూశారు తప్ప.. నా వైపు చూపు తిప్పలేదు. నన్ను కించపరచాలనే ఉద్దేశంతోనే అలా వ్యవహరించారు’’ అని విమర్శించారు. నీట్ పరీక్ష వ్యవహరంలో భారీ కుంభకోణం జరిగిందని ఖర్గే ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న పేపర్ లీకేజీపై చర్చించాలని డిమాండ్ చేస్తుంటే అధికార పక్షం ఎందుకు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
-
బాలికల విషాద ‘ప్రేమలు’
-
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం