- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
New Criminal Laws: ‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి.
దిల్లీ: గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (BNN), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్ (BSA) చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. ఫలితంగా భారత న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికార పక్షం చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం కొత్త చట్టాలను బలవంతంగా అమల్లోకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి.
146 మందిని సస్పెండ్ చేసి..
‘‘ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, భాజపా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. అయితే నేటినుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం. కానీ, భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్ న్యాయం’ ఆధిపత్యాన్ని ‘ఇండియా’ కూటమి ఆమోదించబోదు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గత శీతాకాల సమావేశాలనుద్దేశించి ఖర్గే పైవ్యాఖ్యలు చేశారు. రెండు సభల్లో చాలామంది విపక్ష ఎంపీలను అప్పట్లో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో భద్రతా వైఫల్యానికి సంబంధించి విపక్షాలు చేపట్టిన నిరసనల మధ్య అప్పటి సస్పెన్షన్లు కొనసాగాయి. ఆ సమయంలోనే కొత్త న్యాయచట్టాలు పార్లమెంటు ఆమోదం పొందాయి.
సవరణలు చేస్తే సరిపోయేది..
మరోవైపు కొత్త న్యాయచట్టాల్లో 90-99 శాతం పాత వాటినుంచి కాపీ కొట్టారని సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో మెరుగులుదిద్దినప్పటికీ.. వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందన్నారు. అయితే, కొన్ని మార్పులు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని విషయాల్లో స్థాయి సంఘాలు సైతం తమ అభ్యంతరాలు తెలియజేశాయని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు, బార్ అసోసియేషన్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పలు వేదికలపై కొత్త చట్టాల్లోని లోపాలను ఎత్తి చూపినట్లు చెప్పారు. వీటిని రాజ్యాంగబద్ధంగా అమలుచేసేందుకు దీర్ఘకాలంలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి రావొచ్చని తెలిపారు.
క్రూరమైన చట్టాలు..
కొత్త చట్టాలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ రాజ్యాంగ విరుద్ధమైన, క్రూరమైనవిగా అభివర్ణించారు. ఇండియా కూటమి నుంచి కొంతమంది వీటిపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశామన్నారు. చట్టాలపై తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ సవివరమైన లేఖను కూడా అందించినట్లు వెల్లడించారు.
మరోవైపు వీటిని తేవడంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారన్నారు. దీంతో ఇక వలసపాలన నాటి నేర న్యాయచట్టాలు శాశ్వతంగా కనుమరుగుకానున్నాయని తెలిపారు. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. -
నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి
పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!