- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sudha Murty: 30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రచయిత్రి, వితరణశీలిగా సుపరిచితురాలైన సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభ ఎంపీగా కొత్త బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పెద్దల సభలో ఆమె చేసిన తొలి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై గళం వినిపించిన ఆమెకు స్వయంగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ సుధామూర్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా కన్పిస్తారు. ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య అయిన ఆమె.. గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదంటే మీరు నమ్ముతారా? అదే నిజమంటున్నారామె..! అందుకు కారణం తన కాశీ (Kashi) యాత్రేనని చెప్పారు.
ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులోనే కన్పించే సుధామూర్తి (Rajya Sabha MP Sudha Murty) ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన షాపింగ్కు సంబంధించి ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ‘‘కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి మనకు నచ్చింది వదిలేస్తే మంచిదనే సంప్రదాయం ఉంది. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఓ సారి వారణాసి వెళ్లినప్పుడు గంగా నదిలో నేను షాపింగ్ని వదిలేశా. మరీ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా. అలా గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనలేదు. ఉన్న వాటినే మళ్లీ మళ్లీ కడుతున్నా. మా తల్లిదండ్రులు, తాతముత్తాలు ఉన్నంతలో పొదుపుగా జీవించారు. వారి నుంచే నాకు ఈ నిరాడంబరత అలవాటైంది. మా అమ్మ కబోర్డులో కేవలం 8-10 చీరలే ఉండేవి. మా బామ్మ దగ్గర నాలుగే ఉండేవి. నేను కూడా వారిలాగే పొదుపుగా జీవించాలనుకున్నా’’ అని ఆమె చెప్పారు.
‘‘ఇన్నేళ్లలో నేనెప్పుడూ చీరలు కొనలేదు. నా సోదరీమణులు, స్నేహితులే అప్పుడప్పుడు వాటిని నాకు బహుమతిగా ఇస్తారు. షాపింగ్ వదిలేసిన తర్వాత తొలినాళ్లలో నా అక్కాచెల్లెళ్లు ఏటా రెండు చీరలు పెట్టేవారు. అవి ఇవ్వొద్దని ఆ తర్వాత వారికి చెప్పా. గత 50 ఏళ్లుగా నేను చీరలే కడుతున్నా. నాకు అందులోనే ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది’’ అని సుధామూర్తి తెలిపారు.
ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో సుధామూర్తి ఎగువ సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘‘9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషన్ (Cervical Cancer Vaccination) ఇస్తుంటారు. దానిని తీసుకుంటే.. క్యాన్సర్ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి.. అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం దానిని అందివ్వాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని తన మనసులో నాటుకుపోయిన ఆ మాటల సారాన్ని ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
ఉత్తరాఖండ్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. -
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!
గోవాలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 80 మంది పర్యాటకులు వరదలో చిక్కుకుపోయారు. -
నల్ల డైరీ చెప్పిన గోల్ ‘మాల్’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!
రూ.2500తో డేటా కొనుగోలు చేసి.. రూ. కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. నోయిడాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
పదవుల కోసం నేతలు పోటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గాఢనిద్రలో..!: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం నియామకాలపై కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు. -
రిసార్టులో 49 మంది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదనీరు..
ఠానే జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలు భవనాలు వరదనీటిలో చిక్కుకోగా.. రైల్వే ట్రాక్లపై మట్టిచేరడంతో లోకల్ రైల్ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. -
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్ గర్వాల్ డివిజన్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
గుజరాత్ రాష్ట్రం సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. -
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
గుజరాత్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని పాల్ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. -
కేజ్రీవాల్పైనే దర్యాప్తు జరుగుతోంది
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. -
దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు
హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. -
ఖరారు కాని నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు
వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. -
నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
-
‘కల్కి’ మరో రికార్డు.. కమల్హాసన్ డైలాగ్పై సాయిమాధవ్ ఏమన్నారంటే?
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
-
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్