- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Madras HC: న్యాయమూర్తులకు శాలువాలు, గిఫ్టులు ఇవ్వద్దు..!
హైకోర్టు న్యాయమూర్తులను న్యాయశాఖ అధికారులు కలిసినప్పుడు శాలువాలు, బహుమతుల వంటివి ఇవ్వద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యాయశాఖ అధికారుల ప్రవర్తనా నియమావళికి సంబంధించి మద్రాస్ హైకోర్టు (Madras High Court) పలు కీలక సూచనలు చేసింది. న్యాయమూర్తులను కలిసినప్పుడు శాలువాలు, పుష్ఫగుచ్ఛాలు, ఇతర బహుమతులను ఇవ్వద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం న్యాయమూర్తుల నివాసాలకు వెళ్లవద్దని కూడా సూచించింది. అధికారుల ప్రవర్తనా నియమావళికి (Code of Conduct) సంబంధించి తమిళనాడు స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్, పుదుచ్చేరి జ్యుడిషియల్ సర్వీస్ అధికారులకు మద్రాస్ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది.
‘హైకోర్టు న్యాయమూర్తులను కలిసే సమయంలో వారికి శాలువాలు, మొమెంటోలు, పుష్ఫగుచ్ఛాలు, పండ్లు, ఇతర బహుమతులను ఇవ్వడాన్ని న్యాయాధికారులు నిలిపివేయాలి’ అని మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఇంఛార్జ్) పేరిట ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. పనివేళల్లో అధికారులు కోర్టు ప్రాంగణాన్ని వీడవద్దని.. ఎవరైనా న్యాయవాది లేదా కక్షిదారు నుంచి ఎటువంటి ఆతిథ్యం కూడా స్వీకరించవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా న్యాయమూర్తులను అధికారులు నేరుగా సంప్రదించవద్దని, కేవలం రిజిస్ట్రీ ద్వారానే కమ్యూనికేషన్ జరగాలని సర్క్యులర్లో పేర్కొంది.
వీటితోపాటు అధికారుల డ్రెస్కు సంబంధించి కూడా మద్రాస్ హైకోర్టు పలు సూచనలు చేసింది. కోర్టు ప్రాంగణం బయట ఉన్నప్పుడు నలుపురంగు కోట్, టై ధరించవద్దని సూచించింది. అన్ని న్యాయస్థానాల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్/డిస్ట్రిక్ట్ జడ్జ్/విభాగాధిపతులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
Landslides: ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. వారు వెళ్తున్న బైక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. -
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాగా తాజాగా మరో కేసు నమోదైంది. -
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
NEET UG counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్లో జరిగిన సత్సంగ్ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. -
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
ఖలిస్థాన్ అనుకూలవాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్పాల్ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
కర్ణాటక జలాశయాలకు వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.