- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు.
దిల్లీ: ‘మణిపుర్’ అంశం (Manipur Issue)పై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తోన్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దీనిపై స్పందించారు. ఆ ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మణిపుర్ అంశాన్ని ప్రస్తావించారు.
‘‘మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మా ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 11,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కేంద్ర మంత్రి కొన్ని వారాల పాటు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వరదలు తలెత్తగా.. సహాయం నిమిత్తం రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాం’’ అని మోదీ వెల్లడించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మణిపుర్ (Manipur)లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేశారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని అన్నారు. ఇలాంటి విద్వేష రాజకీయాలను ఏదో ఒక రోజు మణిపుర్ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ను హెచ్చరించారు.
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
బెంగాల్ మూకదాడి ఘటన దిగ్భ్రాంతికరం..
ఈసందర్భంగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన మూకదాడి ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ‘‘నడి రోడ్డుపై ఓ మహిళను దారుణంగా కొట్టిన వీడియోలు సోషల్మీడియాలో కన్పించాయి. ఆ అన్యాయాన్ని అందరూ కళ్లప్పగించి చూశారే తప్ప.. ఆ సోదరికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీనిపై విపక్షాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాల వైఖరి ఆందోళన కలిగిస్తోంది’’ అని మోదీ (Narendra Modi) దుయ్యబట్టారు.
నీట్ లీకేజీ బాధ్యులను వదిలిపెట్టం..
ఇక, నీట్ పీజీ పరీక్షలో పేపర్ లీకేజీ (NEET Row) అంశంపై మోదీ స్పందిస్తూ.. ‘‘పేపర్ లీక్ అంశాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలి. దురదృష్టవశాత్తూ ప్రతిపక్ష సభ్యులు దేశ యువత భవిష్యత్తుపై రాజకీయాలు చేస్తున్నాయి. నీట్లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రధాని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. -
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. -
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
ఒక చేతిలో చాయ్ కలిపే గరిటె.. మరో చేతిలో మైక్తో కనిపిస్తున్న ఓ చాయ్వాలా.. వినియోగదారులకు టీ రుచి చూపిస్తూనే.. గాన మాధుర్యంతో అలరిస్తున్నారు. -
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. -
ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. -
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. -
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు. -
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది. -
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. -
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
బిహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. -
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM