- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hathras tragedy: ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తర్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
హాథ్రస్: సికిందర్రావు ఆస్పత్రిలో మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
హాథ్రస్: ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని హాథ్రస్ (Hathras)లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 116కి చేరింది. ఈ విషయాన్ని అలీగఢ్ రేంజ్ ఐజీ షలాభ్ మాథుర్ తాజాగా ప్రకటించారు. రతిభాన్పుర్లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట సమయంలో భక్తుల హాహాకారాలు, ఆర్తనాదాలతో అక్కడి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మారింది. సికిందర్రావు ఆస్పత్రి సహా పలు చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉండగా.. కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అంతకుముందు ఈ దుర్ఘటనపై హాథ్రస్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇది ఓ ప్రైవేటు కార్యక్రమం. సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ, మిగతా ఏర్పాట్లను నిర్వాహకులే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టిసారించాం’’ అని తెలిపారు.
‘‘ఇప్పటివరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారు. గాయపడినవారికి చికిత్స అందుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి’’ అని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
హాథ్రస్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు విచారం వ్యక్తం చేశారు.
- ‘‘హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’’ - ప్రధాని నరేంద్ర మోదీ
- ‘ఉత్తర్ప్రదేశ్ ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ - అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి
- హాథ్రస్ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తోంది. - రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి
- ఉత్తర్ప్రదేశ్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. క్షతగాత్రులకు చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
హాథ్రస్ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ భోలే బాబా ఓ ప్రకటన విడుదల చేశాడు. -
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కేటాయించిన ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది. -
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..? -
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. -
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. -
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
భారీ వర్షాల నేపథ్యంలో బిహార్లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. -
అదొక భయానక అనుభవం..ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి పోస్టు
విస్తారా ఎయిర్లైన్స్ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. -
జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. -
హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. -
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు. -
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
కాంగ్రెస్ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు. -
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. -
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్(టాన్)పైనా నిషేధం విధించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
-
లోక్సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!