- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వెనక కుట్రదారు.. ఎవరీ సంజీవ్ ముఖియా..?
NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడి కోసం బిహార్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఎవరా సంజీవ్ ముఖియా?
ఇంటర్నెట్ డెస్క్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ (Bihar) పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya). ఈ లీకేజ్ రాకెట్ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరతడు..?
పేపర్ మొదట అందింది సంజీవ్కే
ఈ పశ్నపత్రం (NEET Paper Leak) లీకేజీ వ్యవహారంపై బిహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ రాకెట్లో సంజీవ్ ముఖియా పాత్ర గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ.. అతడే ప్రధాన కుట్రదారు అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రశ్నపత్రం మొదట అందింది సంజీవ్కేనని తెలుస్తోంది. ఓ ప్రొఫెసర్ ద్వారా పేపర్ తీసుకొని.. రాకీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు.. పట్నాలోని ఓ బాయ్స్ హాస్టల్ను అద్దెకు తీసుకుని అందులో 25 మంది విద్యార్థులకు వసతి కల్పించాడని సమాచారం. వారందరికీ లీకైన పేపర్ ఇచ్చి ప్రిపేర్ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడిన తర్వాత మే 6 నుంచి సంజీవ్ కన్పించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎవరీ సంజీవ్ ముఖియా
బిహార్లోని నలందా జిల్లా నాగర్సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ (Sanjeev Mukhiya) తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్సరయ్ బ్రాంచ్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు. గతంలోనూ పలు ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ కేసుల్లో ఇతడి పేరు బయటకురావడం గమనార్హం.
తండ్రీకొడుకుల.. ముఖియా సాల్వర్ గ్యాంగ్
సంజీవ్ కుమారుడు శివ్ కుమార్కు కూడా ఈ నేరాల్లో హస్తం ఉంది. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్.. బిహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి అతడి అసలు పేరు సంజీవ్ సింగ్. భార్య మమతా దేవీ భుఠాకర్ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి స్థానికులు ఇతడిని కూడా ముఖియాగా పిలుస్తున్నారు. సంజీవ్ భార్య 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఆ ఒక్క ఫోన్ కాల్తో తీగలాగితే..
మే 5న నీట్ యూజీ పరీక్ష (NEET Row) జరిగింది. అదే రోజున బిహార్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘నీట్ ప్రశ్నపత్రాన్ని ఓ గ్యాంగ్ లీక్ చేసిందని ఝార్ఖండ్కు చెందిన సెంట్రల్ ఏజెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. నిందితులు ఉపయోగించిన కారు వివరాలు కూడా తెలిశాయి. దీంతో వెంటనే కారును ట్రాక్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నాం. ఆ తర్వాత తీగ లాగితే ఈ కుంభకోణం బయటపడింది. పేపర్ లీక్ చేసినందుకు నిందితులు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30లక్షలు-రూ.50లక్షలు వసూలు చేశారు. ఇందులో బిహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉన్నాడు’’ అని పోలీసువర్గాలు వెల్లడించాయి.
పోలీసులకు చిక్కిన ఫిక్సర్ రవి..
ఈ పేపర్ లీక్లో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతడు సంజీవ్ ముఖియాకు సన్నిహితుడు. నోయిడాకు చెందిన ఇతడు పేపర్ లీక్లో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. రవి గతంలోనూ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయ్యాడు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం రాజస్థాన్లోని కోటాలో ఇతడు కోచింగ్ తీసుకున్నాడు. 2012లో పరీక్ష పాసై రోహ్తక్ కాలేజీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా వచ్చేశాడు. అప్పటి నుంచి ‘ఎగ్జామ్ మాఫియా’ గ్యాంగ్తో సంబంధాలు నెరిపాడు. విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపించి పరీక్ష రాయించడం వంటి నేరాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.