- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sachin Pilot: ఆనాడు రాజీవ్ వద్దన్నట్టే.. ఈసారి మోదీ వదులుకోవాలి: సచిన్ పైలట్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యవహరించినతీరును గుర్తుచేశారు.
దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు సూచిస్తున్నాయని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) అన్నారు. అందుకే నరేంద్రమోదీ(Modi) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు.
‘‘ఈ ఫలితాల విషయంలో భాజపా ఆత్మపరిశీలన చేసుకోవాలి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్కు సుమారు 200 సీట్లు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరగా.. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా రాలేదని తిరస్కరించారు. దాంతో అప్పుడు తర్వాత స్థానంలోఉన్న పెద్ద పార్టీకి పిలుపువచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు భాజపా, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మాత్రం రాలేదు. జనతాదళ్ 143 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు వీపీసింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే.. 293 సీట్లతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీని దక్కించుకుంది. ఈ కూటమి ప్రధాన పార్టీ భాజపాకు 240 సీట్లు వచ్చాయి. గత రెండుసార్లు కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటగా.. ఈసారి మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీని తర్వాత స్థానంలో కాంగ్రెస్(99) ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్