- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET 2024: పరీక్ష నిర్వహణే ‘నీట్’గా లేదు..థర్డ్ పార్టీ రివ్యూలో పలు విషయాలు వెల్లడి
నీట్-2024 నిర్వహణలో చాలా లోపాలు ఉన్నట్లు థర్డ్పార్టీ రివ్యూలో తెలిసింది. చాలాచోట్ల కెమెరాలు, భద్రత కూడా కరవైనట్లు వెల్లడైంది.
ఇంటర్నెట్డెస్క్: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ‘నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024’(NEET 2024)లో తీవ్ర నిర్వహణ లోపాలు ఉన్నట్లు ఎన్టీఏ థర్డ్పార్టీ రివ్యూలో గుర్తించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 4,000 కేంద్రాల్లో జరిగింది. వీటిల్లో 399 సెంటర్లను థర్డ్పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్నిచోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని.. ఉన్నా కొన్నిచోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో కచ్చితంగా రెండు కెమెరాలు ఉండాల్సిందే. దీంతోపాటు ఆయా సెంటర్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చినచోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు.
* ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల పనిచేస్తున్న రెండు కెమెరాలు లేవు. వాస్తవానికి వీటినుంచి వీటి లైవ్ఫీడ్ దిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్కు వెళ్లాల్సిఉంటుంది.
* రివ్యూ బృందం పర్యటించిన వాటిల్లో 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపర్చిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం పంపిణీ చేసేవరకు కచ్చితంగా గార్డ్ రక్షణ ఉండి తీరాలి.
* 83 సెంటర్లలో బయోమెట్రిక్ జాబితాలో ఉన్న సిబ్బంది.. విధుల్లో ఉన్నవారు వేర్వేరు కావడం గమనార్హం.
పరీక్ష రోజున ఏ సెంటర్లోనూ మాల్ప్రాక్టిస్ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీనికింద పరిశీలకులను థర్డ్ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్టీఏ నిబంధనల అమలుతీరును ఎలాఉందో గమనించి నివేదిక ఇస్తారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలుచేసినట్లు వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.