- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
New criminal laws: కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు.
New criminal laws | దిల్లీ: కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పునరుద్ఘాటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి వచ్చిన తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాటిపై విపక్ష నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
స్వాతంత్య్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయవ్యవస్థ లభించిందని అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. అందులోని నిబంధనలతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రిటిష్కాలం నాటి పలు సెక్షన్ల స్థానంలో కొత్త వాటిని తీసుకువచ్చామని తెలిపారు. మహిళలపై హింసకు సంబంధించిన నేరాలపై మాట్లాడుతూ.. బాధితురాలి ఇంటివద్దే ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు కొత్త చట్టాలు అనుమతిస్తాయని, ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే వీలు ఉందని గుర్తుచేశారు. ‘‘మూకదాడులకు సంబంధించి ఇంతకాలం ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. వీటిలో దానిని నిర్వచించాం. రాజద్రోహం అనే పదాన్ని తొలగించాం. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలు శిక్షార్హమైనవి’’ అని వెల్లడించారు.
కొత్త చట్టాల కింద అర్ధరాత్రి 12.10 గంటలకు గ్వాలియర్లో తొలి కేసు నమోదైందని, అది ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించినది హోం మంత్రి తెలిపారు. దీనికి ముందు దిల్లీలో వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజాగా దానిపై మంత్రి స్పష్టత ఇచ్చారు.
New Criminal Laws: న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
‘‘కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై లోక్సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. నాలుగు సంవత్సరాల చర్చ తర్వాతే వాటిని తీసుకువచ్చాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది. వాటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ కూడా రాశా’’ అని అమిత్ షా తెలిపారు. గతంలో పోలీసుల హక్కులకు రక్షణ ఉందని, ఇప్పుడు ఫిర్యాదు చేసిన, బాధిత వ్యక్తి హక్కులకు కూడా రక్షణ లభిస్తుందని చెప్పారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని మరోసారి గుర్తు చేశారు.
మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) అమల్లోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. -
నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి
పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రాలు.. ఏ ఓటీటీలో ఏదంటే?
-
బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్.. బార్బడోస్ నుంచి భారత్కు రానున్న టీమ్ఇండియా
-
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
-
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
-
చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన.. అలాగైతేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి!
-
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత