- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Mrs Chatterjee vs Norway: బిడ్డల కోసం ఓ తల్లి పోరాటం.. నిజ జీవిత మిసెస్ ఛటర్జీ కథ తెలుసా..?
బిడ్డల కోసం ఓ తల్లి జరిపిన పోరాటం ఇప్పుడు సినిమాగా రాబోతోంది. నటి రాణీ ముఖర్జీ నటించిన ఈ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’(Mrs Chatterjee vs Norway) సినిమా వెనక రియల్ స్టోరీ ఉంది.
ముంబయి: తమ పిల్లల కస్టడీ కోసం భారత్కు చెందిన ఓ తల్లి నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం నార్వే, భారత్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగి సరిగ్గా దశాబ్దం గడిచింది. అప్పుడు ఓ తల్లి జరిపిన పోరాటం.. ఇప్పుడు ప్రముఖ నటి రాణీ ముఖర్జీ(Rani Mukherjee)ప్రధాన పాత్రలో సినిమాగా రాబోతోంది. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’(Mrs Chatterjee vs Norway) పేరిట మార్చి 17న విడుదల కానుంది. అయితే దీని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో చూద్దామా..!
భర్త ఉద్యోగం నిమిత్తం పశ్చిమ్ బెంగాల్కు చెందిన భారతీయ జంట నార్వేకు వెళ్లారు. వారే సాగరికా , అనురూప్ భట్టాచార్య. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడైన బాబుకు ఆటిజం లక్షణాలు కనిపించాయి. భర్తేకేమో ఉద్యోగంతోనే సరిపోయేది. ఈ క్రమంలో రెండోసారి తల్లికావడం, ఒక్కతే ఇంటిని చూసుకోవడంతో సాగరిక అలసిపోయేది. ఈ క్రమంలో ఆమెకు పిల్లాడిని చూసుకోవడం కష్టంగా మారింది. మరోపక్క నార్వేలో పిల్లల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పద్ధతులు, ఆచారాలతో సంబంధం లేకుండా అందరూ వాటిని పాటించాలి. ఒక చిన్న దెబ్బ వేసినా, చేత్తో తినిపించినా, పిల్లలకు తల్లిండ్రులకు వేరువేరు పడకలు లేకపోయినా అక్కడ తీవ్రంగా పరిగణిస్తారు. ఇవే సాగరికకు ఇబ్బందిగా మారాయి. ఆమె పిల్లాడిని సరిగా చూసుకోవడం లేదనే సమాచారం నార్వే అధికారులకు అందింది. వెంటనే వారు ఆమె ఇంటికి వచ్చి పరిశీలించారు. అయితే ఆమె నిండు గర్భిణిగా ఉండటంతో అప్పటికి వదిలేసి వెళ్లిపోయారు. మరోపక్క ఆమె బాబును పంపిస్తోన్న ప్లే స్కూల్.. ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూనే ఉంది. ఆమె దినచర్య సరిగా లేదని కౌన్సిలింగ్కు పిలిచింది.
కొద్దిరోజులు గమనించిన అనంతరం ఆ చిన్నారులను సరిగా పెంచడం లేదని, అలాగే తల్లితో పిల్లలకు భావోద్వేగ అనుబంధం లేదని చెప్తూ.. నార్వే అధికారులు పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేశారు. వారిని సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని వెల్లడించారు. 2011లో ఇదంతా జరిగింది. అప్పుడు చిన్నారుల్లో ఒకరి వయసు రెండున్నరేళ్లు కాగా, ఇంకొరికి సంవత్సరం కూడా నిండలేదు. ఈ ఊహించని పరిణామంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమ బిడ్డలను తాము పెంచుకోలేని దుస్థితి పట్ల దు:ఖించారు. ఈ క్రమంలో పిల్లల పెంపకం విషయంలో సంరక్షణా కేంద్రానికే అనుకూల తీర్పు వచ్చింది. పైగా తమ పిల్లలను తాము చూసుకునేందుకు సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ విషయం నార్వే, భారత్లో హెడ్లైన్స్కు ఎక్కింది.
ఇదే సమయంలో సాగరిక, అనురూప్ బంధం కూడా బీటలువారింది. ఈ పోరాటంలో భాగంగా 2012లో పిల్లల బంధువుకు కోర్టు వారి కస్టడీని అప్పగించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం కలగజేసుకోవడంతో ఆ పిల్లలను భారత్ పంపేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే వారు ఆ బంధువు దగ్గరే పెరగాలని షరతు విధించింది. చివరకు పశ్చిమ్ బెంగాల్కు వచ్చి సాగరిక తన పిల్లల కోసం తన పోరాటాన్ని కొనసాగించింది. 2013 జనవరిలో కోల్కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది.ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఎంతో కాలంగా తన బిడ్డలకు దూరంగా ఉన్న ఆమె.. తన సంతోషాన్ని పట్టలేకపోయారు.
ఇప్పుడు రాబోతున్న సినిమాలో రాణీ ముఖర్జీ తన పిల్లల కోసం ఇలాగే పోరాడనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. -
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
NEET-UG 2024: నీట్ రీటెస్ట్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడించింది. -
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
-
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు