- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Railways: రైళ్ల టైమ్ టేబుల్ యథాతథం.. డిసెంబర్ 31వరకు పాతదే వర్తింపు
రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్టేబుల్ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని.. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని భారతీయ రైల్వే వెల్లడించింది.
దిల్లీ: రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్టేబుల్ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని భారతీయ రైల్వే వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని తెలిపింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అన్ని రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేయనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది.
‘‘రైళ్ల సమయాలు, వాటి ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తున్నాం. కొత్త కాలపట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించాలని బోర్డు భావిస్తున్నందున జనవరి 1, 2025 వరకు పాత పట్టికే ఉంటుంది’’ అని రైల్వే బోర్డు వెల్లడిచింది.
రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ భారతీయ రైల్వే ఏటా ‘ట్రెయిన్స్ ఎట్ గ్లాన్స్’ (TAG) పేరుతో ఓ టైమ్ టైబుల్ విడుదల చేస్తుంది. జులై 1 నుంచి వచ్చే జులై 31 వరకు అమల్లో ఉండేలా దీన్ని రూపొందిస్తుంది. తాజాగా ఈ పట్టిక గడువును పొడిగించడంతో అన్ని జోన్లు సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..? -
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. -
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. -
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
భారీ వర్షాల నేపథ్యంలో బిహార్లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. -
అదొక భయానక అనుభవం..ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి పోస్టు
విస్తారా ఎయిర్లైన్స్ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. -
జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. -
హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. -
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు. -
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
కాంగ్రెస్ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు. -
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. -
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్(టాన్)పైనా నిషేధం విధించింది. -
మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
అరుణాచల్ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి
అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
-
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!