IAS: ప్రొబేషనరీ ఐఏఎస్ గొంతెమ్మ కోర్కెలు.. కన్నెర్ర చేసిన ప్రభుత్వం
తనకు అధికారిక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో ఆమెను బదిలీ చేశారు.
పుణె: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. ప్రత్యేక వసతులు అందించాలని ఆమె డిమాండ్ చేయడంతో వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్ (Pooja Khedkar) ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ(VIP) నంబర్ ప్లేట్ ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాక కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ సైతం అమర్చారు. వీటితోపాటు తనకు వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్తో ఓ అధికారిక ఛాంబర్ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్లో తన నేమ్ప్లేట్ పెట్టుకొని దాన్ని తన ఛాంబర్గా వినియోగించుకొన్నారు. అక్కడ ఉన్న కుర్చీలు, సోఫాలు, టేబుల్లతో సహా అన్ని మెటీరియల్లను కూడా తొలగించారు. తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్ప్లేట్, రాజముద్ర, ఇంటర్కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ను ఆదేశించారు. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయిన పూజా ఖేద్కర్ తండ్రి కూడా తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రొబేషన్లో ఉన్న ట్రైనీ ఐఏఎస్ అధికారులకు వీఐపీ ట్రీట్మెంట్, పైన పేర్కొన్న అదనపు సౌకర్యాలేవీ ఉండవు. ఐఏఎస్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటే వారు గెజిటెడ్ అధికారులై ఉండాలి. ఈ విషయాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పూజా ఖేద్కర్ను పుణె నుంచి వాషిమ్కు బదిలీ చేశారు. ఆమె తన ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ UPSCలో 841 ర్యాంక్ సాధించారు. కాగా ఈ ఘటనపై ఆర్టీఐ కార్యకర్త స్పందిస్తూ పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘పూజా ఖేద్కర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో ఐఏఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యారు. ఆమె తండ్రికి రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ.కోట్లలో ఆస్తులు ఉన్నవారు నాన్-క్రిమిలేయర్ కిందకు ఎలా వస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఆమెకు పలు మానసిక సమస్యలు ఉన్నాయని, ఉద్యోగంలో చేరే సమయంలో మెడికల్ టెస్ట్లకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు. ఇవన్నీ దాటుకొని ఆమె ఎలా ఐఏఎస్ అధికారి అయ్యారనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవ్య సేవలకు దివ్యాంగుల కెఫె
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బెంగళూరు ప్రాంగణంలో పూర్తిగా దివ్యాంగుల నిర్వహణలో ‘మిట్టి కెఫె’ పేరిట ఆహారశాల సేవలు ప్రారంభమయ్యాయి. -
కన్నడనాడుకు వరద ముంపు
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి, కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. -
చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టుయంత్రం పంపించిన రాహుల్గాంధీ
ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం తాను కలిసిన చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ శనివారం కుట్టు యంత్రాన్ని పంపించారు. అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్పుర్లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్ చేత్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తివద్ద ఆగారు. -
ప్రమాదకర రీల్స్తో ప్రాణాలకు ముప్పు
సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు.. లైక్స్ పెంచుకోవడం కోసం యువత ప్రాణాంతక విన్యాసాలకు పాల్పడుతున్న ఉదంతాలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదమని తెలిసినా నడిరోడ్లు, రైలుపట్టాలు, ఎత్తైన ప్రాంతాల వంటి చోట్ల రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థుల మృతి: కేంద్రం
ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం.. ఇలా పలు కారణాలతో కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. -
ఎమర్జెన్సీ కాలంలో కాగితాలకే పరిమితమైన రాజ్యాంగం: ధన్ఖడ్
ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం కాగితాలకే పరిమితమైందని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఆ నాటి రోజులను బాధాకరమైన, చీకటి రోజులుగా అభివర్ణించారు. -
దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు
దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమంతో ముడిపడిన చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి. -
‘సహజీవనం ద్విభార్యత్వం కారాదు’
పెళ్లయిన తరవాత వేరే వ్యక్తులతో సహజీవనం చేసేవారికి చట్టం కింద రక్షణ కల్పించడమంటే ద్విభార్యత్వాన్ని గుర్తించడం, అలాంటి తప్పులు చేసే వారిని ప్రోత్సహించడమే అవుతుందని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. -
మాజీ అగ్నివీరులకు.. భాజపా పాలిత రాష్ట్రాల అండ
మిలటరీ నియామకాల పేరిట యువతకు స్వల్పకాల ఉపాధి కల్పిస్తున్న ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేయాలని విపక్షాలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో మాజీ అగ్నివీరులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
హైదరాబాద్లో కర్ణాటక సిట్ సోదాలు
కర్ణాటక రాష్ట్రప్రభుత్వ మహర్షి వాల్మీకి షెడ్యూల్డు తెగల అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల నగదు అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ప్రధాన నిందితుడు సత్యనారాయణవర్మకు చెందిన హైదరాబాద్ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సోదాలు నిర్వహించారు. -
పేదరికం పోతేనే.. వికసిత భారతం
పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, గ్రామస్థాయి నుంచే దానికి కృషి మొదలుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనిని కేవలం ఒక కార్యక్రమంగా తీసుకోకుండా వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొనేందుకు సంసిద్ధులం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
సంక్షిప్త వార్తలు(5)
మోదీ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో సగం మంది దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 17 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 36 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. -
క్యాన్సర్ కేసుల్లో 26% తల, గొంతు క్యాన్సర్ బాధితులే
దేశంలో క్యాన్సర్ బారిన పడిన వారిలో 26 శాతం మంది తల, గొంతు క్యాన్సర్ బాధితులేనని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇలాంటి కేసులు భారత్లో పెరుగుతున్నాయని పేర్కొంది. -
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.2.85 కోట్ల పరిహారం
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా రూ.2.85 కోట్లు చెల్లించాలని జాతీయ లోక్ అదాలత్ ఆదేశించింది. లోక్ అదాలత్ 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక పరిహారం ఇచ్చిన కేసుగా ఇది నిలిచింది. -
ఐఎస్ఎస్లోకి గగన్యాన్ వ్యోమగామి.. కేంద్రం వెల్లడి
గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఒక ప్రశ్నకు లిఖితŸపూర్వక సమాధానం ఇచ్చారు. -
వరుస ఉగ్రఘటనలు.. జమ్మూకు రెండు వేలమంది అదనపు బలగాలు
వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో కేంద్రం అదనపు బలగాలను మోహరించనుంది. ఇందుకోసం రెండువేల మందికిపైగా సిబ్బందితో కూడిన రెండు బీఎస్ఎఫ్ బెటాలియన్లను అక్కడికి తరలిస్తోంది.