- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
LK Advani: నవ భారత నిర్మాణ మార్గదర్శకుడాయన: అడ్వాణీకి ప్రముఖుల శుభాకాంక్షలు
భాజపా అగ్రనేత ఎల్.కె.అడ్వాణీ (LK Advani)కి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్డెస్క్: భాజపా (BJP) అగ్రనేత ఎల్.కె.అడ్వాణీ (LK Advani)కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు.
‘‘భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. ఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటినుంచి ఆయన అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి నాపై చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనివి’’ - వెంకయ్య నాయుడు
‘‘ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉంది. దేశం కోసం ఆదర్శప్రాయమైన కృషి, అసాధారణ సేవ, అంకితభావం కనబరిచి ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఇతరులపై ఆయన చూపించే ఆప్యాయత ఎంతోమందికి ఆదర్శం’’ - చంద్రబాబు నాయుడు
‘‘భాజపా వ్యవస్థాపక సభ్యుడు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉంది. దశాబ్దాల సేవ, నిబద్ధత, నైతికతకు గుర్తింపు లభించింది. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరిలో ప్రేరణ నింపింది’’ - యోగి ఆదిత్యనాథ్
‘‘దేశంలోనే సీనియర్ నాయకుడు, మా మార్గనిర్దేశకుడు ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ - నితిన్ గడ్కరీ
‘‘ఎల్.కె. అడ్వాణీ జీ భారతరత్న పురస్కారానికి పూర్తి అర్హులు. మనదేశంలోని అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్య్రం రాక ముందు నుంచే దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమైనది. ఇలాంటి దిగ్గజ నాయకులు రాజకీయాల స్థాయిని, గౌరవాన్ని పెంచారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు’’- సినీ నటుడు చిరంజీవి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం